తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అప్పుల బాధలు తాళలేక, పంటలు చేతికి అందక ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టీఆర్ఎస్ ఎంపీ కవిత ముందుకొచ్చి.. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే.. వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చి విరాళాలు సమర్పించాలని ఆమె కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులను సురక్షితంగా బయటపడేసేందుకు ముందుకు రావాలని అన్నారు. రైతుల సహకారం కోసం ఈ విధంగా కవిత ప్రారంభించిన విరాళాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తప్పుపట్టారు. రైతుల పేరిట ఆమె వసూళ్ల దందా చేస్తోందని ఆయన ఆరోపించారు.
హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన మధుయాష్కీ.. తెలంగాణలోని కుటుంబాల్లో మహిళల పసుపుతాళ్లు తెగుతూ ఇబ్బందుల్లో ఉంటే, కవిత మాత్రం బతుకమ్మ ఆడుతూ ఊరూరా తిరుగుతోందని అన్నారు. పాలనలో భాగమైన కవిత రైతులను ఆదుకోకుండా, తన సంస్థ ద్వారా డబ్బులు సేకరించి రైతు కుటుంబాలకు పంచుతానని చెబుతోందని ఆయన విమర్శించారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వానికి చేతకాదని కవిత పరోక్షంగా చెబుతోందా? అని ఆయన అడిగారు. అప్పుడు తెలంగాణ అమర వీరుల శవాలపై పేలాలు ఏరుకున్న కవిత, ఇప్పుడు రైతు ఆత్మహత్యలతో వసూళ్లకు పాల్పడుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం మొత్తం వసూళ్లకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ 110 ఎకరాల జాగీరు ఏర్పాటు చేసుకుంటే, కవిత లాక్మే షోరూంలు పెట్టుకుందని, హరీష్ రావు ఆంధ్రావాళ్లతో కలిసి ద్విచక్రవాహన వ్యాపారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
READ ALSO: బతుకమ్మ టైం.. కవిత టైం.. మరి మిగతాటైంలో కవిత ఏం చేస్తుంది..?
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more