రేపటి ఉత్తమ పౌరులుగా నేటి బాలబాలికలను తీర్చిదిద్దాల్సిన బాధ్యతాయుతమైన విధులను నిర్వహించే గురువులు కీచకులై.. కామపిశాచులై విద్యార్థినుల అసువలును తీస్తున్నారు. తాజాగా తన వద్ద విద్యనభ్యసిస్తున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ కామాంధ గురువు. అతని లైంగిక వేధింపులు తట్టుకోలేక కౌసల్య అనే ప్లస్టూ విద్యార్థిని గురువారం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహంతో రాస్తారోకో చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం దిండివనం సమీపం కట్టళై గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కట్టళ్లై గ్రామానికి చెందిన గజేంద్రన్ కుమార్తె కౌసల్య (17) దేవనూరులో ఉంటూ ప్లస్టూ చదువుతోంది. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా బాలికకు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడగానే బిగ్గరగా రోదించి గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. ఇరుగుపొరుగు వారు వచ్చి కౌసల్యను కాపాడే ప్రయత్నం చేస్తుండగానే ప్రాణాలు విడిచింది. ఆత్మహత్యకు పాల్పడిన గదిలోకి వెళ్లిచూడగా తాను చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయుడిని ఉద్దేశించి కౌసల్య రాసిన రెండు పేజీల సూసైడ్నోట్ దొరికింది.
జంతుశాస్త్రం బోధించే టీచర్ రమేష్ లైంగిక వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా. బైబిల్ సాక్షిగా నేను చెప్పింది నిజం' అంటూ ఆ లేఖలో బాలిక పేర్కొంది. 'ఆతను ఎంతమాత్రం మంచివాడు కాదు. నాతో తప్పుగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని బైటకు ఎలా చెప్పాలో తెలియలేదు. నాతో మాత్రమే కాదు, ఇతర విద్యార్థినులతో కూడా నీచంగా వ్యవహరించేవాడు. వారందరినీ అడిగి ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. నేను ప్రాణాలతో ఉండి చెబితే నమ్మేవారా' అనేది తెలియదు. 'రమేష్ పెడుతున్న లైంగిక వేధింపుల నుంచి చావుతోనే నాకు విముక్తి. అతడిని వదలొద్దు, కఠినంగా శిక్షించండి' అంటూ ఆ ఉత్తరంలో కౌసల్య తన ఆవేదనను వెళ్లబోసుకుంది. ఈ ఉత్తరాన్ని చదివిన గ్రామస్తులు కౌసల్య మృతదేహంతో గురువారం ఉదయం 10 గంటలకు చెయ్యూరు-మధురాంతకం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘటనతో సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా సొంతూరుకు వెళ్లిపోగా పోలీసులు విచారణ చేపట్టారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more