మీడియా అంటే నిజాలను వెలికి తియ్యాలి... కనిపించే ఒక దృష్యాన్ని మాత్రమే తియ్యడం కాదు అన్ని కోణాల్లో వార్తలను అందించాలి మీడియా. కానీ మన దేశంలో మాత్రం మీడియా అంటే అతి అని అందరికి తెలుసు. అందుకే గతంలో కూడా మీడియా మీద రకరకాల కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఓ గ్రామస్తులు మాత్రం వద్దు బాబు వద్దు మీరు మా గ్రామానికి రాకుండా ప్రశాంతంగా ఉంటామంటున్నారు. అంతేనా కొంపదీసి మీరు మా గ్రామానికి వస్తే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటూ సుతిమెత్తగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన దాద్రి గ్రామ ఘటన మీద సర్వత్రా చర్చ సాగుతోంది. అక్కడ నిషేదిత జంతు మాంసాన్ని తిన్నారన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని చంపేసిన ఘటన అందరికి తెలిసింది. అయితే అక్కడ మీడియా చేస్తున్న అతివల్ల అందరికి ఇబ్బంది కలుగుతోందని గ్రామస్తులు మండిపడుతోంది.
రెండు మూడు రోజుల క్రితం దాద్రీ గ్రామంలో పరిస్థితి మామూలుగా ఉండేది. కానీ అక్కడ మీడియా వాళ్లు ఎంటరైనప్పటి నుండి పరిస్థితి మారిపోయింది. అక్కడి గ్రామస్తులు మామూలుగా ఉన్నా సరే అదీ ఇదీ అంటూ మీడియా ఒకటే కవరేజ్. అయితే నిషేదిత మాంసాన్ని తిన్నందుకు అక్కడ ఉన్న కొంత మంది ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. అయితే దీని మీద కేవలం వన్ సైడ్ మీడియా వార్తలు రాస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రయారిటి ఇస్తున్నారని కానీ గ్రామంలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందట. గ్రామంలో ఓ బిజెపి నాయకుడిని అరెస్టు చెయ్యడం.... చనిపోయిన వ్యక్తి గురించి పోలీసులు మరో వ్యక్తిని టార్చర్ పెట్టడంతో చనిపోయడని కానీ ఇలాంటి వాటిని మాత్రం మీడియాలో చూపించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి అందుకే మీడియా వారిని అనుమతించడం లేదు. అయినా మీడియా అంటే అందరి పక్షం ఉండాలి కానీ ఇలా ఒక పక్షం అయితే ఎలా అని అంటున్నారు గ్రామస్తులు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more