ప్రస్తుత ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ విస్తరిస్తోంది. ఈ పరిజ్ఞానాన్ని ఎంతోమంది మంచి కార్యాల కోసం ఉపయోగిస్తుంటే.. మరికొందరు మాత్రం వినూత్న మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కొందరు మోసగాళ్లు ‘హ్యాకింగ్’ ద్వారా డబ్బులను దోచేస్తుంటే.. మరికొందరు కనీవినీ ఎరుగని రీతిలో మోసాలకు పాల్పడుతూ డబ్బులను దండుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా జరిగిన సంఘటనను తీసుకోవచ్చు. ఈ-కామర్స్ వెబ్ సైట్లలో దిగ్గజంగా పేరుగాంచిన ‘ఫ్లిప్ కార్ట్’ను ఓ హైదరాబాదీ 200 సార్లు మోసగించి, సుమారు రూ.20 లక్షలు దోచేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈమేరకు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఆ సంస్థ ఫిర్యాదు చేసింది.
‘ఫ్లిప్ కార్ట్’ సంస్థ తమ కస్టమర్ల నమ్మకాన్ని మరింతగా చూరగొనేలా 'ప్లెక్సిబుల్ రిటర్న్ పాలసీ'ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్లో ఆర్డర్ చేసుకున్న వస్తువు నచ్చకపోయినా.. అందులో ఏదైనా లోపం గుర్తించినా.. దాన్ని నియమిత సమయంలోపు వెనక్కిచ్చేస్తే వెంటనే ఆ డబ్బు వాపస్ చేయబడుతుంది. పైగా.. ‘ఎందుకు, ఏమిటి’ అని ప్రశ్నించడం కూడా ఉండదు. దీన్ని ఆసరాగా తీసుకున్న వీరాస్వామి అనే యువకుడు తనదైన రీతలో కొత్త ఆలోచన చేసి, మోసం చేయడం ప్రారంభించాడు. తన కుటుంబ సభ్యులు, ఇరుగు, పొరుగు వారి పేర్లతో పలు వస్తువులకు ఆర్డర్ ఇచ్చేవాడు. ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేవాడు. అవి ఇంటికి డెలివరి అయిన తర్వాత అవి నాసిరకంగా ఉన్నాయంటూ.. వాటి స్థానంలో నకిలీ ఉత్పత్తులను వెనక్కు పంపుతుండేవాడు. ఈ వస్తువులు ఫ్లిప్ కార్ట్ కు చేరగానే వీరాస్వామి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుండేది. ఈ తతంగం గత 20 నెలలుగా జరిగింది. దాదాపు 200కు పైగా ప్రొడక్టులను కొన్న వీరాస్వామి.. వాటిని వెనక్కు పంపడం ద్వారా రూ. 20 లక్షలు స్వాహా చేశాడు.
అయితే.. తరచూ ప్రోడక్టులు వెనక్కు వస్తుండటంతో ‘ఫ్లిప్ కార్ట్’ సంస్థకు అనుమానం వచ్చింది. దాంతో ఆ సంస్థ తనదైన రీతిలో విచారణ చేయగా.. ఆ యువకుడి మోసం బట్టబయలైంది. ఇతను మోసం చేసిన తీరు పోలీసులనే అబ్బుర పరిచింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటువంటి కేసు నమోదవడం ఇదే తొలిసారని పోలీసులు పేర్కొన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more