JanaReddy restless speech in assembly media point

Janareddy restless speech

JanaReddy, farmers, Suicide, Te;angana, Media, Assembly Media Point, KCR, Telangana govt

Congress Senor leader Janareddy restless speech. Opposition leaders very suffer very sad by the Janareddy speech

జానారెడ్డి... సోది ఎక్కువ మ్యాటర్ తక్కువ

Posted: 10/05/2015 11:12 AM IST
Janareddy restless speech

నేటి ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను మొత్తం అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెండ్ చేస్తూ సభలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే సీనియర్ నేత జానారెడ్డి అసెంబ్లీ  సమావేశాల నుండి బయటకు వచ్చారు. నిజానికి కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన నాయకులకు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం మీద పెద్ద మనిషిగా జానారెడ్డికి అన్ని పార్టీల నాయకులు నాయకత్వాన్ని అప్పగిస్తే.. జానాసార్ మాత్రం తన పాత ప్లాన్ వేశారు. రైతుల ఆత్మహత్యల మీద, రైతులకు వన్ టైం సెటిల్ మెంట్ చెయ్యలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు తీర్మానాలకు పట్టుబట్టారు. అయితే అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రతిపక్ష నాయకులను సభ నుండి సస్పెన్డ్ చేస్తూ ప్రతిపాదించాయి.

మీడియా ముందుకు వచ్చిన అన్ని పక్షాల నాయకుల్లో జానారెడ్డి సీనియర్ కాబట్టి ఆయనకే ముందు అవకాశం కల్పించడం పరిపాటి. కానీ దాదాపు అర గంటకు మించి మీడియాతో మాట్లాడిన జానారెడ్డి ఎంతకీ ఊకదంపుడు ఉపన్యాసం చేశారు తప్పిదే తాను చెప్పదలిచిన పాయింట్ ను షార్ప్ గా చెప్పలేకపోయారు. రైతుల ఆత్మహత్యల మీద అది ఇదీ అంటూ ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించినా పెద్దగా ప్రతిఫలం మాత్రం కనిపించలేదు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు అంతా మీడియా పాయింట్ లో జానారెడ్డి మాట్లాడుతున్నంత టైం ఎప్పుడెప్పుడు సారుగారి స్పీచ్ ముగుస్తుందా అని ఎదురుచూశారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం అన్న ఓ మాటను తప్ప జానారెడ్డి ఏమీ చెప్పలేకపోయారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JanaReddy  farmers  Suicide  Te;angana  Media  Assembly Media Point  KCR  Telangana govt  

Other Articles