దేశంలో రైతుల ఆత్మహత్యల మీద పెద్ద చర్చే నడుస్తోంది. ఎటు చూసినా రైతుల ఆత్మహత్యల మీద రాద్దాంతం నడుసస్తోంది. అది దిల్లీ దగ్గరి నుండి మన తెలుగు రాష్ట్రాల వరకు అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. అయితే రైతుల ఆత్మహత్యలకు మీ ప్రభుత్వం కారణం అంటూ అధికార, ప్రతిపక్షాలు తన్నుకు చావడానికి అసెంబ్లీ సమావేశాల్లో టైం సరిపోవడం లేదు. అయితే ఓ రాష్ర్ట ముఖ్యమంత్రి గారి ఓ పిలుపు మాత్రం రైతులకు అండగా నిలుస్తోంది. వారికి అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అందరిచేత సహాయాన్ని పొందుతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనీసం ఆ సిఎంను చూసినై మారి.. ఇక్కడి రైతుల పరిస్థితిని మారిస్తే బాగుంటుంది. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరు..? ఏ రాష్ట్రంలో అనే అనుమానాలకు కింది స్టోరీ క్లారిటీ ఇస్తుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తమ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద చలించిపోయారు. దాంతో తమ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో కొత్తగా ఓ పథకాన్ని రూపొందించారు. దాని ప్రకారం రైతుల ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న కారణాలను తెలుసుకొని... వారికి అండగా నిలబుడుతుంది అక్కడి ప్రభుత్వం. జల్ యుక్త్ శివార్ అభయాన్ అనే పేరుతో కొత్త ఆశలు చిగురింపజేశారు మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్. అలా ఏర్పాటు చేసిన నిధికి అందరూ తమకు తోచినంత సహాయం చేశారు. హీరో అక్షయ్ కుమార్ దగ్గరి నుండి క్రికెటర్లు, మోడల్స్ ఇలా అందరూ తమ వంతు సహాయాన్ని అందించారు. అందులో భాగంగా ఏకంగా 400 కోట్ల రూపాయలు పోగేశారు. కరువు పరిస్థితులను దాటేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరి సహాకారం ఎంతో కీలకంగా మారింది. అయితే తెలుగు రాష్ట్రాల సిఎంలు కూడా ఇలా రైతుల కోసం ఏదో కొత్తగా వారి బతుకుల మీద ఆశలు చిగురించేలా చేస్తే బాగుంటుంది. మరి ఈ విషయం మన తెలుగు చంద్రులకు తెలుస్తుందో లేదో..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more