పారిస్ లోని లా రిజర్వు హోటల్ లో జరుగుతున్న పారిస్ ఫ్యాషన్ వీక్ కోసం అప్పటి వరకు దేదీప్యమైన విద్యుత్ దీపాల కాంతుల వెలుగులతో వెలిగిపోయింది. అయితే అప్పుడప్పుడే ప్రముఖుల రాక మొదలైంది. ఒక్కరక్కరుగా వస్తున్నారు. హోటల్ వెలుపల భారీ భద్రత నడుమ అథిధులు రాక కోసం ఆహుతులు, వారి ప్రతినిదులు వేచి చూస్తున్నారు. ఇంతలో ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ, టీవీ నటి కెండాల్ జెన్నర్ పారిస్ ఫ్యాషన్ వీక్ కు హాజరైయ్యారు. అంతే అప్పటి వరకు వున్న వెలుగులకు తోడు కళాకాంతి వచ్చినట్లయ్యింది. ఎందుకంటారా..?
కెండాల్ జెన్నర్ ధరించిన దుస్తులు ఆ షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అమె ఔరా అనిపించింది. 19 ఏళ్ల ఈ మోడల్.....ఈ సరికొత్త తరహా దుస్తులతో హాట్ టాపిక్ గా మారింది. అహుతులు, అతిధులు, ప్రేక్షకులు ఇలా ఒక్కరేమిటీ అందరని తన డ్రెస్సు మైకంలో ముంచేసి.. వారి చూపులను ఏ మాత్రం పక్కకు తిప్పుకొనియకుండా చేసి..పారిస్ ఫ్యాషన్ వీక్ మొత్తంలో హైలెట్ గా నిలిచింది.
షీర్ బ్లాక్ జంప్ సూట్ ఆమె అందాలను అరబోసేలా చేసింది. తెల్లని మేనుఛాయ.. నల్లని ఉల్లిపోర దుస్తుల నుంచి బయటకు కనిప్తిస్తుంటే.. అందరూ అమె వైపు నుంచి చూపులు తిప్పుకోలేకపోయారు. కెండాల్ జెన్నర్ అతి త్వరలోనే సంచలన మోడల్గా మోడలింగ్ రంగాన్ని ఓ ఊపు ఊపడం ఖాయం అంటున్నారు ఆ రంగానికి చెందిన విశ్లేషకులు. అయితే ఇంతలా అందాల అరబోతకు ధైర్యం కూడా తోడవ్వాలి కదా అంటారా..? ఈమె ఎవరనుకుంటున్నారు...? అందాల ఆరబోతలో పేరుగాంచి కిమ్ కర్థాషియాన్ పోదరి, నవంబర్ 3, 1995లో జన్మించిన ఈమె తన సిస్టర్స్తో కలిసి ఓ టీవీ రియాల్టీ షోలో పాల్గొనడం ద్వారా కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో తన సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ ఆరబోత అంటూ కూడా కామెంట్లు వినబడుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more