ఇన్నాళ్లూ తన ప్రసంగాలతో దేశ ప్రజల్లో సరికొత్త చైతన్యాన్ని నింపుతూ వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. ‘ఫేస్ బుక్’ వ్యవస్థాపకుడు జుకెర్ బర్గ్ తో జరిపిన చిట్ చాట్ సందర్భంలో ఆయన కంటతడి పెట్టిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. జుకెర్ బర్గ్ అడిగిన ఓ ప్రశ్న ఆయన్ను ఏడిపించింది. ఇంతకీ ఆ ప్రశ్నేంటి? ఆ ప్రశ్నకు, ఈయనకు సంబంధం ఏమిటి? అని అనుకుంటున్నారా..! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఫుల్ బిజీగా వున్న మోదీ.. ఆదివారం జుకెర్ బర్గ్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. తొలుత ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో వారివురు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరికీ సంతోషాన్నిచ్చింది. ఇక వారివురి మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలోనే జుకెర్ బర్గ్ మాట్లాడుతూ.. ‘మీకు, మాకు చాలా సారూప్యత వుంది. మనకు మన కుటుంబం చాలా ముఖ్యం. నా తల్లిదండ్రులు ఇక్కడే వున్నారు. మీ జీవితంలో కూడా మీ అమ్మగారు చాలా కీలకం కదా?’ అంటూ ప్రశ్నించారు. దీంతో తనను పెంచడానికి తన తల్లి పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్న మోదీ.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు.
‘‘నా జీవితంలో నా తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. మాది చాలా నిరుపేద కుటుంబం. నేను రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడిని. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మేం అప్పుడు చాలా చిన్న పిల్లలం. మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో పనిమనిషిగా చేసేది. తన పిల్లలను పెంచడానికి ఒక తల్లి ఎంత కష్టపడాలో చూడండి. కేవలం ఒక్క నరేంద్ర మోదీ తల్లే కాదు, భారత్ లోని ఎంతోమంది తల్లులు తమ పిల్లలను పెంచడానికి తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు ఇఫ్పుడు 95 ఏళ్లు. ఇప్పటికీ ఆమె తన పనులను తనే స్వయంగా చేసుకుంటారు’’ అని మోదీ చెప్పారు. ఈ మాటలు విన్న ప్రతిఒక్కరు భావోద్వేగానికి గురయ్యారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more