ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతలా ఖర్చు పెడుతున్నారో అందరికి తెలుసు. విదేశీ పర్యటనల పేరుతో నారా గారు చేస్తున్న ఖర్చు మీద నేషనల్ మీడియా కూడా రకరకాల కథనాలను ప్రసారం చేసింది. అయితే అయినవాళ్లకు కంచాల్లో.. మిగిలిన వాికి అరటాకుల్లో అన్నట్లు చంద్రబాబు తన వరకు అయితే మాత్రం ఎతైనా ఖర్చు చెయ్యడానికి సిద్దపడ్డారు. కానీ తన ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులు మాత్రం కాస్త ఎక్కువగా ఖర్చు చేస్తే అస్సలు మింగుడుమడటం లేదు. అందుకే వారి ఖర్చు తగ్గుంచుకునేలా కొత్తగా ఓ ప్లాన్ కూడా సిద్దం చేశారు చంద్రబాబు. అసలే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర ఖజానాకు కాస్తైనా భారం తగ్గిద్దామని చంద్రబాబు గారి ఆతృత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏపి పరిపాలనా వ్యవహారాలను చూడడానికి సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగానే పరిపాలనను నిర్వహించేందుకు చూస్తున్నారు. గతంలో హైదరాబాద్ సెక్రటేరియట్ నుండి పరిపాలనా వ్యవహారాలను చూసిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మారుతున్న పరిస్థితులను బట్టి అడ్మినిస్ట్రేషన్ ను విజయవాడ కేంద్రంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఎపి ప్రభుత్వం ఐఎఎస్,ఐపిఎస్ అదికారులకు ఖర్చులపై ఆంక్షలు విధించింది. ప్రత్యేకించి హైదరాబాద్ ,విజయవాడల మధ్య తిరగడం పెరిగినందున ఈ ఆదేశాలు ఇచ్చారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఎక్కువకాలం ఉంటున్నందున ఉన్నతాధికారులు అక్కడకు తరచు వెళ్లవలసి వస్తోంది. దాంతో ఖర్చు పెరుగుతోందని ఆర్దిక శాఖ భావిస్తోంది.ఈ నేపధ్యంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.దాని ప్రకారం విజయవాడకు విమానం ద్వారా రాను,పోను పదివేల రూపాయల టిక్కెట్ ఖర్చు దాటితే విమాన ప్రయాణం వద్దని,రైలు లేదా సొంత కారు ద్వారా రావాలని సూచించింది. విజయవాడలో స్టార్ హోటళ్లలో బస చేయకుండా టూరిజం హోటళ్లలో ఉండాలని కూడా తెలిపింది. అలాగే సీనియర్ అదికారులు ముఖ్యమంత్రి లేదా ఛీప్ సెక్రటరీ చెబితే తప్ప వేరే సిబ్బందిని వెంటబెట్టుకు రారాదని కూడా ఈ మార్గదర్శకాలలో పేర్కొన్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more