నిన్నటివరకు దేశంలో మోడీ నామాన్ని ప్రతిఒక్కరూ జపం చేసేవారు. ‘మోదీ వచ్చాడు.. మంచి రోజులు రానున్నాయి’ అంటూ నినాదాలు చేసేవారు. కానీ.. ఇప్పుడు ఇందుకు భిన్నంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ సర్కార్ చేపడుతున్న వినూత్న విధానాలు ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో ఆయనపై విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు మరో విషయం నేపథ్యంలో నెటిజన్లు మండిపడటంతో.. మోదీ సర్కార్ దిగిరాక తప్పలేదు. ఇంతకీ ఏ విషయంలో ఈ వివాదం చెలరేగింది? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
ఉగ్రవాదులు ఇంకా రకరకాల నేరాలకు పాల్పడేవారందరూ సోషల్ మాధ్యమాలను ఎక్కువగా వాడుతున్నారన్న విషయాన్ని నిఘావర్గాలు ఎప్పుడో తేల్చాయి. ఈ మధ్య వీటి ద్వారానే ఎక్కువ నేరాలు జరిగినట్లు రుజువయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ భద్రతపై తాజాగా కేంద్రప్రభుత్వం కొత్త పాలసీని తీసుకువచ్చింది. ప్రతిపాదిత ఎన్ క్రిప్టెడ్ చట్టం పరిధి నుంచి వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలకు మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది. కంప్యూటర్, మొబైల్ మాధ్యమంగా జరిగే సమాచార బట్వాడాకు సంబంధించిన అన్ని టెక్ట్స్ మెసేజ్ లను 90 రోజులపాటు కచ్ఛితంగా నిల్వ ఉంచుకోవాలని తెలిపింది. అంతేకాదు.. ఆయా మెసేజ్ ల వివరాల కావాలని నిఘా వర్గాలు, విచారణ సంఘాలు అడిగితే.. వాటిని కచ్చితంగా పంచుకోవాలని పేర్కొంది. అలా చేయని పక్షంలో క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం ముసాయిదా ప్రతిపాదనలు సోమవారం తయారు చేసింది. అంతే.. ప్రభుత్వం అలా తయారుచేసిందో లేదో ఒక్క రోజులోనే దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ప్రైవేటు మెసేజ్ లపై కేంద్రం పెత్తనం ఏంటని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో జాతీయ ఎన్ క్రిప్షన్ విధానాన్ని సవరిస్తూ.. కేంద్రప్రభుత్వం ఈరోజు (మంగళవారం) ఉదయం ఆఘమేఘాల మీద క్లారిఫికేషన్ ఇచ్చింది. సామాజిక మాధ్యమాలకు ఈ నూతన విధానం వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వాడుతున్న వారిపై పెత్తనం చేయడం తమ ఉద్దేశం కాదని, జాతీయ భద్రతాంశాలు ముడిపడివున్న చోట మరింత నిఘా కోసమే ఈ ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more