రిజర్వేషన్ల మీద మరో నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారి పోరాటం కారణంగా చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ల మీద మనీష్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎంత కాలం రిజర్వేషన్లు ఉండాలి..? ప్రస్తుతం మనం 21 శతాబ్దంలో ఉన్నా కానీ రిజర్వేషన్లు అవసరమా అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ రిజర్వేషన్ల తొలగింపు కోసం పావులు కదుపుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మనీష్ తివారీ లాంటి వ్యక్తి కూడా రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించడం కొత్త చర్చకు దారి తీసింది. బిజెపి పార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను తొలగించాలని తన ఎజెండాలో పొందుపరుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. రిజర్వేషన్లు ఎవరెవరికి, ఎన్నాళ్లకాలం ఉండాలో నిర్ణయించేందుకు కమిటీని నియమించాలి’ అని ఆదివారం ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు.
రిజర్వేషన్ల వ్యవస్థపై సమీక్ష మాత్రం అవసరం. 21వ శతాబ్దంలోనూ కోటా ఉండాలా? ఒకవేళ ఉండాలంటే... అది ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే ఉండాలి. కుల ప్రాతిపదికన కాదు. దారిద్య్రమే వెనుకబాటుతనానికి ప్రాతిపదిక అని మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. వర్గం, కులం, మతాలకు అతీతంగా... ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలన్నారు. అసలు రిజర్వేషన్లు ఉండాలా, వద్దా అనే అంశంపైనే చర్చించాలి. ఉంటే... దేని ప్రాతిపదికన ఉండాలి? కుల ప్రాతిపదిక నుంచి ఆర్థిక ప్రాతిపదికన మార్చాలా? దీనిపై చర్చ జరగాలి అని మనీశ్ తివారీ తెలిపారు. గతంలో కాంగ్రె్సకే చెందిన జితిన్ ప్రసాద, జనార్దన్ ద్వివేదీ కూడా రిజర్వేషన్ల కొనసాగింపుపై భిన్నగళం వినిపించారు. వీరిద్దరూ ఏకంగా అధిష్ఠానానికే తమ అభిప్రాయాలు తెలియచేశారు. బలహీన వర్గాల్లోని పేదల్లాగే, అగ్రవర్ణ పేదలూ ఇబ్బందులు పడుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన, ఆక్రోశం అగ్రవర్ణ పేదల్లో పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మండల్ రాజకీయాలపై పునఃసమీక్ష అవసరం అని జితిన్ ప్రసాద కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more