దేవుడి సొమ్మును కూడా ఎత్తుకుపోతున్నారు.గణేష్ మంటపాల్లో లడ్డూలకూ రక్షణ కరువైంది. ఏమాత్రం భయం, భక్తీ లేకుండా పట్టుకుపోతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా మాయం చేస్తున్నారు. దేవుణ్ని దర్శించుకుందామని వచ్చే భక్తులకు... కేటుగాళ్ల భయం పట్టుకుంది. మంటపాలకు రావాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో జరిగే గణేష్ ఉత్సవాలకు దొంగల బెడద తప్పట్లేదు. దేవుడి సొమ్మును కూడా దర్జాగా పట్టుకుపోతున్నారు. మంటపాల్లో విలువైన వస్తువులన్నీ దొంగలపరమవుతున్నాయి. నిర్వాహకులు పక్కకు తిరిగితే చాలు చోరగాళ్లు హాంఫట్ చేస్తున్నారు. వినాయక చవితిని భారీఎత్తున జరిపే హైదరాబాద్లో ఇదో పెద్ద సమస్యైపోయింది. నగర శివారు ప్రాంతాల్లో చోరీలు విపరీతంగా జరుగుతున్నాయి. దేవుడి చేతిలో లడ్డూలు కూడా పట్టుకుపోతున్నారంటే... దొంగతనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గణేశుడి లడ్డూకి విపరీతమైన డిమాండ్. నిమజ్జనం రోజున లడ్డూలను వేలం వేయడం ఆనవాయితీ. బాలాపూర్ గణపతి లడ్డూ ఏటా లక్షల్లో పలుకుతుంది. అలాంటి విశిష్టత ఉండే లడ్డూపై దొంగల దృష్టి పడింది. ఈ చోరీలు ఎక్కువవడంతో కొన్ని మంటపాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. స్మాల్ స్పాట్.
LB నగర్లోని ఓ గణేశ్ మంటపం దగ్గర రాత్రి సమయంలో చోరీ జరిగింది. ఇక్కడకు వచ్చిన ముగ్గురు దొంగలు... హుండీ, సౌండ్ సిస్టం, ఎలక్ట్రానిక్ వస్తువులతోపాటు లడ్డూ కూడా పట్టుకుపోయారు. ఈ చోరీ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. స్పాట్ చోరీ చేసిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడ్రోజులుగా ఎల్బీనగర్లో ఇలాంటి దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఆరు మంటపాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఈ గ్యాంగే ఇదంతా చేసి ఉంటుందని పోలీసుల అనుమానం. తమ మంటపాల్ని పోలీసులే కాపాడాలంటున్నారు బాధితులు. ఇప్పటివరకు ఆరు లడ్డూలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more