తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టింది రోడ్లు, ప్లై ఓవర్లు నిర్మించేందుకు నేటి నుంచి టెండర్లు పిలువనుంది. 18 జంక్షన్లలో చేపట్టనున్న పనులకు… వెయ్యి 96 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. రోడ్ల నిర్మాణ పనుల్లో పాదర్శకంగా వ్యవరిస్తామన్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్. స్ట్రాటర్జిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద.. తొలిదశ టెండర్ల ప్రక్రియ ఇవాళ సాయంత్రం నుంచి మొదలు కానుంది. వెయ్యి 96 కోట్ల రూపాయలకు పైగా నిధులతో.. 18 జంక్షన్ల దగ్గర చేపట్టనున్న ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విడగొట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించిన జిహెచ్ఎంసీ అధికారులు.. నవంబర్ తొమ్మిదో తేదీన ప్రైస్ బిడ్లు తెరిచి ఏజెన్సీలను ఫైనల్ చేయనున్నారు.
21వేల కోట్ల రూపాయల అంచనాతో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, ఎక్స్ ప్రెస్ వేలు, స్కైవేలు నిర్మించాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఫస్ట్ టర్మ్ లో 18 జంక్షన్ల పరిధిలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించారు అధికారులు. ఈపీసీ – డిఫర్డ్ యాన్యుటీ టెండర్లపై కాంట్రాక్టర్ల డౌట్స్ క్లారిఫై చేశారు అధికారులు.24 నెలల్లోగా పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతాలే కాకుండా, భూ సేకరణ సమస్యలు లేని ప్రాంతాలను ఎంపిక చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు ఫ్లైఓవర్లతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రోడ్ల విస్తరణ, ఫుట్ పాత్ ల నిర్మాణం, కేబుళ్ల కోసం కామన్ డక్ట్ ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం, జాగింగ్ ట్రాక్, క్రాస్ డ్రైన్స్, లైటింగ్ పనులు, సైనేజీలు, రోడ్ మార్కింగ్, రోడ్డుపై ఇల్యుమినేషన్ స్టడ్స్ పనులు చేయనున్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.. జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్. ప్రతియేటా 700 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more