గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా వున్న పాతబస్తి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గొల్కండ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. భూ వివాదానికి సంబంధించిన విషయంలో జరిగిన వాగ్వాదం చివరకు గాలిలో తూటాలను పేల్చడం వరకు దారితీసింది. సంఘటన వివరాల్లోకి వెళ్తే... టోలిచౌకికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జాబేర్పటేల్ కొన్ని రోజుల కిందట గోల్కొండలో ఒక ఫ్లాట్ విషయంలో స్థానికులతో గొడవపడ్డాడు. ఈ విషయం ఆనోట ఈ నోట పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని పిలిచి సర్దుబాటు చేసుకొమ్మని సలహా ఇచ్చారు.
పోలీసుల సూచనల మేరకు ఇరువైపుల నుంచి పలువురు భేటీ అయ్యి.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మార్గాలను అన్వేషించసాగారు. ఈ భేటీలో జాబేర్, సహా గోల్కొండకు చెందిన ప్రత్యర్థి ఫరీద్ కూడా వున్నారు. చర్చల సందర్భంగా ఇద్దరి మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వదానికి దారితీసింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన జాబేర్ తన తుపాకితో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. సమన్వయంతో చర్చిద్దామని పిలిచి తుపాకీ కాల్పులతో తనను భయభ్రాంతుడిని చేశాడని, భాదితుడు ఫరీద్ పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు ఫరీద్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. జాబేర్ పటేల్ జాతీయ మైనార్టీ సెల్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. కేవలం కేంద్ర, రాష్ట్ర అమాత్యులకు మాత్రమే అనుమతి వున్న ఎర్రబుగ్గ వాహనాన్ని కూడా జబేర్ పటేల్ వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్న పోలీసులు అతనిపై పై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. దీంతో పాటు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు అరా తీస్తున్నట్లు సమాచారం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more