తమను ఏవరూ చూడటం లేదని చోరీలకు, దొంగతనాలకు పాల్పడే కేటుగాళ్లను అనేక మందిని నిఘా నేత్రాలు ఎప్పటికప్పుడు పట్టిస్తున్నా.. ఇంకా బంగారం, వజ్రాల దుకాణాల్లో మాత్రం దొంగతనాలు జరుగుతూనే వున్నాయి. అచ్చం సినిమాల్లో ప్రతినాయకుల పాత్రలతో త్వరగా అకర్షితులవుతున్న దోంగలు.. అదే తరహాలో దొంగతనాలకు పాల్పడి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో కడుపులో డ్రగ్స్ పెట్టుకుని ఎంచక్కా అక్రమ రవాణా చేద్దామనుకున్న యువతి ఘటనను మరువక ముందే.. మరో మహిళ అదే తరహాలో దొంగతనానికి తెరతీసింది.
అయితే అది మన దేశంలో కాదులేండి.. కాకపోతే ప్రాణాలపైకి మాత్రం తెచ్చుకుని బతికితే చాలు దేవుడా అనుకుంటూ సర్జరీకి సహకరించింది. బ్యాంకాక్ లో పెద్ద వజ్రాలు, నగల దుకాణానికి వెళ్లిన ఓ చైనా మహిళ నగలను, వజ్రాలను బాగా చూసింది. కొందామని కాదు.... లేపేద్దామని. వాటిలో కోటీ 40 లక్షల విలువ చేసే వజ్రాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని ఎవ్వరూ చూడకుండా గబుక్కున మింగేసింది. నిజంగానే అమెను ఎవరూ గమనించలేదు. అయితే అమె తాపీగా తప్పించుకుని దుఖానం నుంచి పాకిపోయింది కూడా.
ధాయ్ లాంగ్ నుంచి వెళ్లేందుకు అమె విమానాశ్రయంలోకి చెక్ ఇన్ అవుతుండగా, అమెను పరిశీలించిన విమానాశ్రయ సిబ్బంది అమెను అడ్డుకున్నారు. అమె కడుపులో ఏదో వస్తువుందని వారు ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో మొదట్లో తన కడుపులో ఏం లేదని బుకాయించిన మహిళ తరువాత నిజాన్ని అంగీకరించింది. ఇంకేముందు హుటాహుటిన రంగంలోకి దిగిన వైద్యులు అమెను పరీక్షించారు. ఆ వజ్రం ఎక్కడ ఉందో అని స్కానింగ్ చేసి పరిశీలించగా ప్రేగుల్లో ఇరుక్కుపోయి ఉందని తెలిసింది. వజ్రం కారణంగా చైనా మహిళ చనిపోవడం ఖాయమని కూడా వైద్యులు తెల్చేశారు. సర్జరీ జరిగిన తరువాత గానీ ఏమీ చెప్పలేమని చెప్పారు. అయితే ఆమెను బతికించడం కోసం వైద్యులు చాలా కష్టపడి ఆపరేషన్ చేశారు. మొత్తానికి మహిళ కోలుకుంది. మహిళ ఒంట్లో నుంచి ఆరు కేరెట్ల వజ్రాన్ని బయటకు తీశాడు. ఆమె కోలుకున్న తరువాత దొంగతనం చేసినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more