అవును.. మీకు చదివింది కరెక్టే... కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొందామని ప్లాన్ వేసుకున్నాడో మహానుభావుడు. అయినా దేనికైనా ఎక్కువగా ఎడిక్ట్ అయితే ఇలానే ఉంటుంది. అవసరాల కోసం కొంత మంది తమ బ్లడ్ ను, కిడ్నీలను, చివరకు కళ్లను అమ్ముకుంటుంటే.. టెక్నాలజీకి దాసోహం అంటూ కొంత మంది ఇలా చేస్తుండటం నిజంగా వింత అనిపిస్తోంది. తాజాగా చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రపంచంలో టెక్నాలజీలో కొత్త శకానికి తెర తీసిన ఐఫోన్ కొత్తగా 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను లాంఛ్ చేసింది. అయితే వరల్డ్ వైడ్ లా ఈ ఫోన్ లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఐఫోన్ అమ్మాకాల మీద అందరకి ఉన్న పిచ్చి ఎలా ఉందో తెలిపే మరో ఘటన ఇది.
చైనాలో ఉంటున్న వూ అనే వ్యక్తి.. ఐ ఫోన్ కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్6ను కొనాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే అందుకు తగిన డబ్బులు తనతో లేకపోవడంతో అతడికొ ఆలోచన వచ్చింది. తన కిడ్నీ అమ్మైనా సరే తాను మాత్రం ఐఫోన్ 6ను కొనుక్కోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతే అనుకున్నదే తడువుగా ఓ ఏజెంట్ ను కూడా కాంటాక్ట్ అయ్యాడు. దాంతో అతడు ఆ ఫోన్ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు ఇస్తానని ఒప్పందం కూడా కుదిరింది. అయితే ఇదంతా తన పక్కింటి ఆయనకు చెప్పాడు. అయితే విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఎంతలా వద్దని చెబుతున్నా వినలేదు. చివరకు ఓపిక నశించిన ఆ పక్కింటాయన పోలీసులకు సమాచారం అందించాడు. అయితే పోలీసుల ఎంట్రీతో వూ పారిపోయాడు. మొత్తం వ్యవహారం మీద పోలీసులు డీప్ గా ఎంక్వైరీ చేస్తున్నారు. అయినా ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకోవడం ఏంటా అని ఆశ్చర్యపోవడం మాత్రం మనవంతైంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more