అమెరికా.. అగ్రరాజ్యంగా వెలుగుతోంది. అయితే అక్కడికి అన్ని దేశాల నుండి ప్రజలు, ప్రముఖులు వెళుతుంటారు. అయితే అక్కడ విమానాశ్రయాల్లో నిర్వహించే తనిఖీలు చాలా సార్లు.. చాలా దేశాలకు కోపం తెప్పించాయి. అయితే అబ్దుల్ కలాం నుండి అమితాబ్ వరకు ఎంతో మంది భారతీయ ప్రముఖులకు అక్కడి అమెరికా విమానాశ్రయాల్లో చాలా సార్లు అవమానాలు జరిగాయి. అక్కడి అధికారులు తనిఖీల పేరుతో వారిని అడ్డుకోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తాయి. అయితే అమెరికాలో మన ప్రముఖులకు ఇక మీదట ఈ కష్టాలు తప్పనున్నాయి. భారత్ నుండి వచ్చే దాదాపు 2వేల మందికి ఇక మీదట ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా పంపించెయ్యాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటు చాలా దేశాలకు చెందిన ప్రముఖులకు ఇక మీదట తనిఖీల బెడద ఉండదు. ఒక్క ప్రముఖులకే కాదు మామూలు వ్యక్తులకు కూడా ఇక మీదట తనిఖీల బెడద తప్పుతుంది. అది ఎలాగో తెలుసుకోండి.
అమెరికా గ్లోబర్ ఎంట్రీ పేరుతో కొత్త ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రామ్ కింద భారత్ ముందుగా రెండు వేలమంది జాబితాను రూపొందిస్తోంది. ఇప్పటికే ఆ జాబితాలోకి సినిమా యాక్టర్లు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, రాజకీయ నేతలు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పేర్లను ఖరారు చేశారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఈ జాబితా కేవలం రెండువేల మందికి పరిమితం కాదని, సెలబ్రిటీలు, వీఐపీల జాబితా ముగిశాక, దరఖాస్తు చేసుకున్న సామాన్య పౌరులకు కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ జాబితాకు ఎంపిక చేసే వారికి ఎవరికీ కూడా నేర చరిత ఉండకూడదని, ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడి ఉండరాదని తెలిపాయి. ‘ఎంట్రీ ఫ్రీ’ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి బ్యాగ్రౌండ్ను భద్రతా సిబ్బంది ముందుగానే తనిఖీ చేస్తుందని చెప్పాయి. ఈ జాబితాలో ఉన్న వారి లగేజ్ను కూడా అమెరికా విమానాశ్రయాల సిబ్బంది తనిఖీ చేయరని, అయితే వారి దేశంలో అడుగుపెట్టినట్లు తెలుసుకోవడానికి ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేలు ముద్రలు తీసుకుంటారని ఆ వర్గాలు వివరించాయి. మొత్తానికి అమెరికా మనవాళ్లకు మొన్నటి దాకా ఉన్న తనిఖీల బెడద దాదాపు ఉండదనే చెప్పొచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more