తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భర్తీ చెయ్యనున్న ఉద్యోగాల్లో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇంటర్వూ నిర్వహించాలని టిఎస్ పిఎస్సీ నిర్ణయంతీసుకుంది. అయితే దీని మీద చాలా మంది మేధావులు కూడా అభ్యంతరం తెలిపారు. కానీ కేడర్ పెద్దది కనుక ఖచ్చితంగా ఇంటర్వూ నిర్వహించాల్సిందే అంటూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. నిజానికి అంతకు ముందు గ్రూప్ 2లో ఎలాంటి ఇంటర్వూ టెస్ట్ లు లేవు. కానీ టెక్నికల్, నాన్ టెక్నికల్ క్యాడర్ లను విభజించిన తర్వాత మాత్రం ఇంటర్వూలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్రదిన వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూనియర్ లెవల్ అధికారి పోస్టులకు ఇంటర్వ్యూలను నిలిపివేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ చెప్పినట్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రూప్ 1 కేటడ్ మినహా ఏ ఉద్యోగాలకు ఇంటర్వూలు నిర్వహించకూడదని కేంద్రం ఆదేశించింది.
తాజాగా గ్రూప్-1 మినహా అన్ని గ్రూప్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డీవోపీటీ శాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. డీవోపీటీ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కోతన్ రాసిన లేఖ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందింది. ఈ నేపథ్యంలో జూనియర్ లెవల్ పోస్టులకు ఎక్కడైనా ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటే నిలిపివేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని డీవోపీటీ తన లేఖలో పేర్కొంది. అవినీతిని నిరోధించేందుకు, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు, నిరుపేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఇబ్బందులను దూరం చేసేందుకే ఈ చర్యను చేపట్టాల్సిందిగా ప్రధాని ఆదేశించారని తెలిపింది. మెరిట్ ఆధారంగానే ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రధాని స్పష్టం చేశారని వివరించింది. జూనియర్ లెవల్ ఆఫీసర్ పోస్టులను గుర్తించి వాటి భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని తొలగించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 స్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటే రద్దు చేయాలని.. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది.
మొత్తానికి ఎంతో కాంలగా నడుస్తున్న ఇంటర్వూ సస్పెన్స్ కు ఇప్పటికైనా తెర పడుతుందని చాలా మంది నిరుద్యోగులు, మేధావులు ఆవిస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయి పోస్టులు కాబట్టి వాటి భర్తీలో స్థానిక పబ్లిక్ సర్వీస్ కమీషన్ లకు పూర్తి స్థాయి స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా వచ్చింది. కాబట్టి కేంద్రం ఆదేశాలను ఖచ్చింతగా పాటించాలని రాష్ట్రానికి లేదు. అయితే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపధ్యంలో కూడా కేంద్రం ఆదేశాలనుండి తమకు మినహాయింపు కలిగించాలని అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగాల భర్తీలో గతంలో ఎన్నో అవకతవకలు జరిగిన నేపధ్యంలో తెలంగాణ సర్కార్ దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more