Fatal road accident in East Godavari

Fatal road accident 18 people died

Fatal , road accident , 18 people , died , East Godavari , Andhra Pradesh

Fatal road accident 18 people died. In East Godavari dist Gandepalli national high way, major accident happened in this early morning.

తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

Posted: 09/14/2015 07:39 AM IST
Fatal road accident 18 people died

తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతిచెందగా, 16 మందికి గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా కూలీల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి లారీలో సిమెంట్ బూడిదెను విశాఖకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పనులు ముగించుకుని రాత్రి 11 గంటల ప్రాంతంలో ఏలూరు బైపాస్ వద్ద బూడిద లారీలో 35 మంది కూలీలు బయల్దేరారు.

అందులో 18 మంది మృతి చెందారు. స్థానికులు, పోలీసులు 16 మందిని రక్షించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు, తొంగడి అన్నవరం ప్రాంతానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి విశాఖకు సిమెంట్ బూడిద లోడు లారీ వెళుతోంది. 19 రోజుల క్రితం పనుల కోసం వలస కూలీలు చింతపూడికి వెళ్లారు. రాత్రి చింతపూడి నుంచి ఏలూరు వరకు బస్సులో వచ్చారు. ఏలూరు బైపాస్ వద్ద కూలీలు బుడిద లారీ ఎక్కారు. నాలుగు మృతదేహాలను స్థానికులు, పోలీసులు వెలికి తీశారు. గాజు శ్రీనాథ్(నాగేశ్వరపురం), బల్లపల్లి దొరబాబు(విజయపురం), గాదె దొరబాబు(శృంగవరం), కడి సూరి(విజయనగరం) వాసులుగా గుర్తించారు. లారీ బోల్తాపడిన సమయంలో కూలీలు గాఢ నిద్రలో ఉన్నారు. గాయపడిన క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ బోల్తాపడగానే డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్, క్లీనర్‌ల కోసం గాలిస్తున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fatal  road accident  18 people  died  East Godavari  Andhra Pradesh  

Other Articles