ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానదిపై మరో ఆనకట్ట నిర్మించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం, కృష్ణా జిల్లాలోని గనిఆత్కూరు గ్రామాల మధ్య ఈ బ్యారీజీని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయంతో కూడుకున్న ఈ డ్యాం నిర్మాణం వెనుక ఓ బలమైన కారణం కూడా వుంది. అదేమిటంటే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ తాగునీటి సమస్యలు తీర్చేందుకే దీనిని నిర్మిస్తున్నారు.
కృష్ణమ్మపై బ్యారేజీ కట్టడం ద్వారా నీటి అవసరాలు తీరడంతోపాటు పర్యాటకంగానూ అభివృద్ధికి బాటలు పడతాయని అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో ఈ బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ బ్యారేజీ వల్ల మరో ప్రయోజనం కూడా వుంది. అదేమిటంటే.. మెట్ట ప్రాంతాల్లో భూగర్భ నీటి పరిమాణం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ నిలబడే నీటిని 60 లక్షల మంది ప్రజల అవసరాలకు వాడుకోవచ్చట. అలాగే.. అదనపు లభ్యతను బట్టి రాయలసీమకు సులువుగా తరలించవచ్చన్నది బాబు సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఈ బ్యారేజీ నిర్మించేందుకు వైకుంఠపురం ప్రాంతం అనుకూలమని అధికారులు సైతం తేల్చారు. ఇక కేవలం సర్కార్ రంగంలోకి దిగడమే ఆలస్యం. ఏదేమైనా.. ‘అమరావతి’ వల్ల రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా.. బ్యారేజీ నిర్మాణానికి అధికారులు తేల్చిన వైకుంఠపురం ప్రాంతం ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన ఉంది. ఇక్కడ ఓ కొండను తాకుతూ నది ఉత్తర దిశగా తిరుగుతుంది. ఎద్దువాగు, మున్నేరు, పాలేరు, వైరా, కట్లేరు తదితర చిన్న నదులు ఈ ప్రాంతంలోని నదిలో కలుస్తాయి. ఇక్కడ నది వెడల్పు కూడా చాలా ఎక్కువ. మొత్తం 3 కి.మీ. పైగా ఆనకట్టను నిర్మించాల్సి వుంటుంది. సుమారు 15 టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేసుకోవచ్చు. నది మధ్య లంక భూమి ఉన్నందున పర్యాటకంగానూ అభివృద్ధి బాటలు పడుతుంది. ఇన్ని అనుకూలతలు వుండటం వల్లే ఏపీ ప్రభుత్వం కృష్ణమ్మపై మరో బ్యారేజీకి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more