పెళ్లి చూద్దామని వచ్చి.. పెళ్లి కొడుకుగా మారడం ఏంటి.. ఏ సినిమా స్టోరీ అనుకుంటున్నారా..? ది సినిమా కథ కాదు.. రియల్ స్టోరీ.. తమిళనాడులో చోటుచేసుకున్న వాస్తవ కథ. తమిళనాడు తమిళనాడులోని నాగర్ కోయిల్ సమీపంలోని వడివీవ్వరం అనే ఊరిలోని అళగమ్మాల్ ఆలయంలో మణికంఠన్, ఉమాప్రియ అనే యువతీ యువకులకు వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ ఆలయంలో ఓ సంప్రదాయం ఉంది. ఆలయంలో వివాహం జరుగుతుంటే, ఇది తమకు మొదటి వివాహమే అని అమ్మవారికి తెలుపుతూ ఓ పత్రంపై సంతకాలు చేయాల్సి వుంటుంది. ఒకవేళ అమ్మవారి ముందు తప్పుడు వివరాలు ఇస్తే పాపం చేసినట్లవుతుందని.. దీనికి శిక్షతప్పదని అక్కడి వారి నమ్మకం. అయితే మరికొద్ది సేపట్లో పెళ్లి అనుకున్న సమయానికి పెళ్లి కొడుకు భయపడ్డాడో.. లేదంటే మరేమైందో తెలియదు కానీ సంతకం పెట్టనంటే పెట్టను అంటూ మొండికేశాడు.
పెళ్లి కొడుకు ప్లేట్ ఫిరాయించడంతో అక్కడి వచ్చిన వారు. పెళ్లి కూతురు తరఫు వాళ్లు ఆశ్చర్యపోయారు. ఎంతో ఖర్చు చేసి పెళ్లికి సిద్దమైతే ఇదంతా ఏంటని వాళ్లు తలలు పట్టుకున్నారు. తాము ఇప్పటికే చాలా ఖర్చు పెట్టామని ఆ డబ్బు ఇవ్వాల్సిందేనని వధువు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వరుడి తరఫు బ్యాచ్ ని స్టేషన్ కు తీసుకువెళ్లారు. పోలీసుల ముందు కూడా ఆ పెళ్లి కొడుకు అదే మాట అన్నాడు. పెళ్లికి రెడీ కానీ.. సంతకం చెయ్యడం మాత్రం కుదరదు అని మొండి పట్టుపట్టాడు. సరే ఎలాగూ అక్కడి దాకా వచ్చింది కదా... వివాహం ఆగకూడదని భావించిన పెళ్లి పెద్దలు, దాన్ని చూసేందుకు వచ్చిన గోపకుమార్ అనే యువకుడితో చర్చించి పెళ్లికి ఒప్పించారు. గోపకుమార్ సైతం ఉమాప్రియను పెళ్లాడేందుకు అంగీకరించడం, ఆపై సంతకాలు, ఘనంగా వివాహం జరిగిపోయాయి. మణికంఠన్ కు ఇదివరకే పెళ్లి జరిగివుండవచ్చని, అమ్మవారికి భయపడే సంతకం చేసేందుకు వెనుకంజ వేశాడని, ఇదీ ఒకందుకు మంచిదే అయిందని పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు సంతోషపడటం విశేషం. ఏం జరిగినా అంతా మంచే జరిగింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more