వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నడో స్కూలింగ్ ముగించుకువచ్చారు. కానీ తాజాగా ఓ మంత్రి గారు స్కూల్ లో అడిగినట్లు మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అయినా అయినా ఆ మంత్రి గారు జగన్ ను ఎందుకు ప్రశ్నించారు..? ఏం ప్రశ్నలు అడిగారు..? ఇంతకీ ఆ మంత్రి ఎవరో తెలుసా..? ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు జగన్ కు ఏడు ప్రశ్నలు అడిగారు. దీక్ష చేసే ముందు తాను వేసే ప్రశ్నలకు జవాబు చెప్పాలని జగన్ కు సవాల్ విసిరారు మంత్రి. ప్రత్యేక హోదా సాధన కోసం దీక్ష చేస్తానని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రుల మాటల యుద్ధం కొనసాగుతోంది. 5 కోట్ల మంది ప్రజల ఆత్మాభిమానం గురించి మాట్లాడని జగన్.. ప్రత్యేక హోదా గురించి ఎలా మాట్లాడతారని రావెల కిషోర్ బాబు నిలదీశారు. ప్రభుత్వానికి జగన్ సహేతుకమైన సూచనలు ఇస్తే తీసుకుంటామని.. కాని ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేస్తే మాత్రం ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు.
రావెల కిషోర్ బాబు అడిగిన ప్రశ్నలు....
1. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అవరోధాలు సృష్టిస్తున్నా జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు?
2. హైదరాబాద్ లోని సీమాంధ్రుల హక్కుల గురించి జగన్ ఏనాడైనా మాట్లాడారా..?
3. కోర్టు తీర్పులకు విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఫాస్ట్ జీవోపై జగన్ మాట్లాడారా..?
4. సెక్షన్-8పై ఇంత రాద్ధాంతం జరిగినా ఎందుకు స్పందించలేదు?
5. ఆంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్ధుల ఫీజు రీఎంబర్ మెంట్స్ గురించి ఏనాడైనా ప్రశ్నించారా..?
6. 1200 మంది విద్యుత్ ఉద్యోగులను తొలగించినప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదు
7. తెలంగాణలో తన ఎమ్మెల్యేలను కాపాడుకోకుండా రెండుకొంటే ఒకటీ ఫ్రీ అని ఉన్న ఎమ్మెల్యేను కూడా కేసీఆర్ కు అప్పగించడం నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more