ఏపీ కేబినెట్లో మహిళా మంత్రిగా ఉన్న పీతల సుజాత మరోసారి వివాదంలో పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెను వారించి ఇంకా ఏడాది కూడా గడవకముందే అమె మరోమారు తన తప్పును పునరావృతం చేశారు. కర్నూలు లో ఆమె మహిళా,స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై సమీక్షించేందుకు ముందు అమెను ఆ జిల్లాకు చెందిన అధికారులు ప్రసన్నం చేసుకున్నారు. తమ తప్పులేమైనా వుంటే ఖాయమని చెబుతూ.. అమాత్యుల వారికి విలువైన పుత్తడి నెక్లస్, పట్టుచీరను బహుమతిగా ఇచ్చారు. అయితే అధికారులు నుంచి కాని, ఉద్యోగుల నుంచి కానీ, కాంట్రాక్టర్ల నుంచి కానీ లేక ఇతర వ్యక్తుల నుంచి కానుకల రూపంలో లభించే ఏ వస్తువును స్వీకరించవద్దని, అది తన మంత్రి పదవికే అపకీర్తి తీసుకువస్తుందని తెలసికూడా అమాత్యుల వారు వాటిని రహస్యంగా స్వీకరించారు.
పద్దెనిమిది మంది సిపిడిఓలు ఐదేసి వేల రూపాయల చొప్పున పోగుచేసుకుని తొంభై వేలతో నెక్లస్, పట్టుచీర ఇచ్చారని ప్రచారం జరుగుతున్నా.. వాటి విలువ అంతకన్నా అధికంగానే వుంటుందని తెలుస్తుంది. సీపీడిఓలు ఏదో చూచాయగా తెలిసిన మీడియా ఎదుట అదెంత.. రెండూ కలపి తొంబై వేలాగా అంటూ తమ వస్తువలును తక్కువ చేసే ప్రయత్నం చేశారని, కానీ ఆ కానుకలు విలువ మరింత అధికంగానే వుంటుందని సమాచారం. అయితే ఇలాంటి కానుకలు గ్రటా తీసుకోవద్దని ఇప్పటికే మంత్రివర్యులకు సాక్షాత్తు చంద్రబాబు తేల్చిచెప్పారు.
ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు గత ఏడాది అక్టోబర్ మాసంలో సన్మానం చేశారు. అయితే ఈ సన్మానంలో ఆమెకు రూ.40 లక్షల విలువ చేసే వడ్డాణం కూడా బహూకరించారన్న వార్తలు బయటకు వచ్చాయి. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సిద్దా రాఘవరావు సోదరుడు అధ్యక్షతనే గ్రానైట్ వ్యాపారులు మంత్రిగారిని ప్రసన్నం చేసుకుని తమ వ్యాపారాలు సజావుగా, సక్రమంగా, ఎలాంటి అవంతరాలు లేకుండా సాగేలా చూడాలని కోరుకుంటూ ఈ చిరు కానుక సమర్పించుకున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆమెపై అగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా చెప్పి ఇంకా సంవత్సరం కూడా తిరగనలేదు. అప్పుడే మంత్రివర్యులు అధికారుల నుంచి బహుమతులు లాగేస్తున్నారన్న వార్త సంచలనంగా మారింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more