Wife commits suicide in Hyderabad| Harassment

Dowry harassment drives woman to suicide

house harassments in Hyderabad, Extramarital affairs in Hyderabad, Hyderabad house Harrassements, Suicides in Hyderabad, housewife suicides in Hyderabad, Hyderabad, Extramarital affairs, suicides, dowry harrassment, nizampet, guntur, sukanya, mahesh, suicide, violence against women, crime against women, attrocity at women, harrassment on women

A wife, who came to know that her husband had already got married, and been harassed by husband family for additional dowry commits suicide in Hyderabad.

అదనపు కట్నం అగ్నికిలలకు మరో అబల అహుతి

Posted: 09/09/2015 04:31 PM IST
Dowry harassment drives woman to suicide

నిజాన్ని దాచి వంచించారు. అది చాలదన్నట్లు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వరకట్న వేధింపులకు పాల్పడ్డారు. చివరకు ఓ నవ వధువు ఉసురు తీశారు. వరకట్నం అక్కర్లేదని చాటుతే సే నో టు డౌరీ అంటూ యువత వరకట్నాలకు దూరంగా జరుగుతున్న క్రమంలో మరో అబల వరకట్న అగ్నికిలలకు అహుతయ్యింది. మానసిక అవేదనను భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. భర్త, అత్తమామలు కలిసి అదనపు వరకట్నం కోసం వేధించడంతో వాటిని భరించలేని ఆ వివాహిత మంగళవారం రాత్రి తన పడక గదిలో ఆత్మహత్యకు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని నిజాంపేట ప్రాంతానికి చెందిన సుకన్యను.. గుంటూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తికిచ్చి అమె తల్లిదండ్రులు గత యేడాది మే 21న ఘనంగా వివాహం చేశారు. వివాహమైన కొద్ది రోజులకే.. ఇరుగుపోరుగు వారి నుంచి నిజాన్ని తెలుసుకున్న సుకన్య షాక్ కు గురైంది. తన భర్తకు అంతకుముందే వివాహం అయ్యిందని, అమెను రెండో భార్యగా చేసుకున్నాడన్న నిజం తెలిసి నిలదీసింది.. దాంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. మానసికంగా కుమిలిపోతున్న సుకన్య ఈ విషయాన్ని అమె తల్లిదండ్రులతో చెబుతుందన్న అనుమానంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు అమె భర్త సహా అత్తమామలు కలిసి అదనపు కట్నం వేధించసాగారు.

ఈ వేధింపులను భరించలేని సుకన్య... గత ఏప్రిల్ నెలలో పుట్టింటికి తిరిగి చేరుకుంది. చానాళ్లుగా తన భర్తలో మార్పు వస్తుందని వేచిన సుకన్య.. నిన్న రాత్రి గుంటూరులో తన భర్త నివాసించే కాలనిలోని ఇరుగుపోరుగు వారితో ఫోన్ ద్వారా సంబాషించింది. తాను ఎంతకాలం ఎదురుచూసినా.. తన భర్తలో మార్పు కనరాదని తెలుసుకుందో ఏమో.. లేక తన భర్త గురించి మరన్ని విషయాలు తెలియడంతోనో మొత్తానికి  అప్పటి నుంచి మరింత కుంగిపోయింది. ఆ తరువాత తన పడక గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుని ఆత్మహత్య చేసుకుంది.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామాకు తరలించారు. అయితే, సుకన్య నివశిస్తున్న కాలనీవాసులు స్పందిస్తూ మహేష్‌కు రెండో వివాహంగా సుకన్యను ఇచ్చి పెళ్లి చేసినట్టు చెప్పారు. అంటే మొదటి పెళ్లి జరిగిన విషయాన్ని మహేష్ దాచిపెట్టి ఈ పెళ్లి చేసుకున్నట్టు వారు చెపుతున్నారు. అంతేకాకుండా, వివాహ సమయంలో సుకన్య తల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ.10 లక్షల వరకు వచ్చినట్టు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dowry harrassment  nizampet  guntur  sukanya  mahesh  suicide  

Other Articles