తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతకంతకు దారుణంగా మారింది. నీరు లేక జలాశయాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. తెలుగు నేల నీటి చుక్క కోస ఎదురు చూస్తోంది... ఇలా రకరకాల వార్తలు రాసిన మీడియా ఇప్పుడు అన్ని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి అనే వార్తలు రాస్తున్నాయి. నిన్నటి దాకా డెడ్ ప్టోరేజీకి వచ్చిన నీటి మట్టం వర్షాల కారణంగా కాలువల ద్వారా నీరు జలాశయాలకు చేరి నీటి మట్టం పెరిగింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ఎట్టకేలకు ప్రాజెక్టులకు జలకళ వస్తోంది. సుంకేసులతో మొదలుపెట్టి పలు ప్రాజెక్ట్లలోకి ఇన్ఫ్లో భారీగా ఉండండతో.. కృష్ణా బేసిన్లో వరద ఉధృతి కనిపిస్తోంది. ప్రస్తుతం డెడ్స్టోరేజ్కి చేరిన శ్రీశైలం ప్రాజెక్ట్లోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది.
నిన్న దాదాపు రెండున్నర టీఎంసీల నీరు చేరినట్టు అంచనా వేస్తున్నారు. సుంకేసుల దాదాపుగా నిండడంతో 10 గేట్లు అడుగుమేర తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ అవుట్ఫ్లో నిన్న లక్షా 60 వేల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 45 వేల క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. ఈ వరదంతా శ్రీశైలంకు చేరుతుండడంతో నీటి కష్టాలు కాస్తలో కాస్త తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఎగువ నుంచి నాలుగైదు రోజులు ఇదే ఇన్ఫ్లో ఉంటే పరిస్థితి మెరుగుపడుతుందని శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. డ్యామ్లో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులైతే, ప్రస్తుతం 800 అడుగుల మేర నీరుంది. మొత్తానికి తుంగభద్ర, కృష్ణా నదులు నీటితో రైతుల కంట ఆనంద భాష్పాలను తీసుకువస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more