ఎన్నో ఆశలతో రూపుదిద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతానికి కొత్త కష్టాలు ఎదురవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూసేకరణ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వానికి.. భవిష్యత్తులో మరో రూపంలో కష్టాలు వచ్చిపడుతాయని సీఆర్డీయే వెల్లడిస్తోంది. అదేమిటంటే.. నూతన రాజధాని ప్రాంతంలో సేకరించిన భూమిలో.. 10 వేల ఎకరాల వరకూ తరచూ ముంపునకు గురవుతోందని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీయే) తేల్చి చెప్పింది.
ముఖ్యంగా కొండవీటి వాగు 29.50 కిలోమీటర్ల పొడవుండగా, 7,300 క్యూసెక్కుల వరదనీరు అమరావతి మీదుగా ప్రవహిస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ వరద కారణంగా 13,500 ఎకరాలు మునిగిపోగా.. అందులో 10,600 ఎకరాలు సమీకరించిన భూమిలో ఉందని వివరించింది. ఈ లెక్కప్రకారం.. మొత్తం అమరావతి పరిధిలో వరదొస్తే నాలుగో వంతుకు పైగా ప్రాంతం నీట మునుగుతుందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో.. ఈ విషయమై వెంటనే కాంటూరు సర్వే చేయించాలని, వరద తీవ్రతను గుర్తించేందుకు నిపుణులైన హైడ్రాలజికల్ కన్సల్టెంట్ ను నియమించాలని సిఫార్సు చేసింది. అలాగే.. కృష్ణా వరదకట్టల అడుగున వున్న ఇసుక, పూడిక ఏ మేరకు ఉందో తేల్చాలని కోరింది.
ఇదిలావుండగా.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా బ్యారేజీ వద్ద నీటి అడుగు భాగంలో సర్వే కోసం ఐఐటీ టెక్నాలజీస్ ను కన్సల్టెంట్ గా నియమించి, 1.53 కోట్లకు కాంట్రాక్టు అప్పగించింది. ఇప్పుడు కాంటూరు సర్వే కోసం మరెంత ఖర్చవుతుందోనని అనుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more