Chandrababu | Assembly | Pattisema

Chandrababu naidu counters to ysrcp on pattisema

Chandrababu, Assembly, AP, YSRCP, Pattisema, Jagan, Jyothula Nehru

Chandrababu Naidu counters to YSRCP on pattisema. He asked the YSRCP Leaders on Pattisena project.

ITEMVIDEOS: నామీద రాళ్లేస్తున్నారన్న చంద్రబాబు

Posted: 09/02/2015 07:44 PM IST
Chandrababu naidu counters to ysrcp on pattisema

పట్టిసీమ ప్రాజెక్ట్ కడతామంటే వైసీపీ సభ్యులు నవ్వారని, ఇప్పుడు వాళ్లే నవ్వులపాలయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఏంటో వారికి ఇప్పుడు అర్థమైందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పట్టిసీమ ప్రాజెక్ట్ పై టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై గరిష్టంగా కృసి చేస్తున్నట్టు సభలో తెలిపారు. తమ ప్రయత్నాలను అడ్డుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆయన ఫైర్ అయ్యారు. పట్టిసీమపై మీ స్టాండ్ ఏంటో చెప్పాలని వైసీపీని ఆయన సూటిగా ప్రశ్నించారు.. ఇక ఎత్తిపోతలపై అనుకూలమో కాదో తెలిపిన తర్వాత చర్చకు రావాలని ఆయన సూచించారు.

గోదావరి జిల్లాలపై అందరికంటే ఎక్కువ భాద్యత ప్రభుత్వానికుందన్నారు.. చంద్రబాబు. గోదావరివాసుల ప్రయోజనాలకు తాము ప్రధమ ప్రాధాన్యమిస్తామన్నారు. జిల్లావాసులకు అన్యాయం జరుగుతుందని వాదిస్తున్న ప్రతిపక్షం.. రెండో పంటకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదేనని గుర్తుంచుకోవాలన్నారు. అయితే రాయలసీమ అభివృద్ధికి, పట్టిసీమ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. నిధుల దుర్వినియోగం, అవినీతికే తమ పార్టీ అడ్డుపడుతోందన్నారు వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ. దానికి స్పందించిన చంద్రబాబు అభినందించలేక రాళ్లేస్తున్నారని, ఇప్పటికైనా కన్ ఫ్యూజన్ లో నుంచి బయటికి రమ్మంటూ కౌంటర్ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Assembly  AP  YSRCP  Pattisema  Jagan  Jyothula Nehru  

Other Articles