కేంద్ర మంత్రి, తెలుగుదేశం నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనాచౌదరికి టైం బాగోలేనట్టుగా వుంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చిన నాటి నుంచి కాలం కలసివచ్చనట్లు లేదు. ప్రస్తుతం ఆయనకు న్యాయస్థానాల్లో దెబ్బ మీద దెబ్బ తాకుతోంది. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనపై కొరడా ఝుళిపించింది. సుజనా యూనివర్సల్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ పేరుతో ఒక విదేశీబ్యాంకు నుంచి తీసుకున్న రూ.106 కోట్ల అప్పును నెలరోజుల్లోగా తీర్చాలంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లించని పక్షంలో తన సంస్థ ఆస్తుల్ని అమ్మైనా వసూలు చేయాల్సిందేనన్నది ప్రత్యర్థి మారిషెస్ కమర్షియల్ బ్యాంకుకు పట్ల సానుకూల తీర్పునిచ్చింది.
2014లో మారిషస్కు చెందిన మారిషెస్ కమర్షియల్ బ్యాంకు.. సుజనా సంస్థ తమను మోసం చేసిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 92 కోట్ల రూపాయలను హైస్టియా హోల్డింగ్ లిమిటెడ్ పేరుతో రుణాన్ని తీసుకుందని.. అప్పటి నుంచి అసులు సహా వడ్డీకి కూడా కట్టలేదని చెప్పింది. అపరాధ రుసుముతో కలిపి అది రూ.106 కోట్లు అయ్యిందని సదరు పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల ఈ కేసును తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ 30 లోపు సుజనా సంస్థ సదరు మొత్తాన్ని చెల్లించాలని హైకోర్టు తీర్పును వెలువరించింది.
హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుజనా సంస్థల అధికారులు. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు వెలువరించిన తీర్పుతో ఏకభవిస్తూ.. ఈ నెల చివరి నాటికి 106 కోట్ల రూపాయలను చెల్లించాలని, ఒకవేళ డబ్బులేని పక్షంలో సుజనా సంస్థ అస్తులను విక్రయించైనా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ కేసు నుంచి సుజనా సంస్థ అధినేత బయటపడని పక్షంలో వ్యాపారపరమైన ఇబ్బందులతోపాటు రాజకీయంగా కూడా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఇటు దేశీయ, అటు విదేశీ బ్యాంకులను కోట్ల రూపాయల మేరకు ముంచిన సుజనకు కేంద్ర మంత్రి పదవి ఎలా కట్టబెడతారని, ఇదే బిజేపి ప్రభుత్వం నిజాయితీని స్పష్టం చేస్తుందని కాంగ్రెస్ విమర్శలు, అరోఫణల పర్యానికి తెరలేపిన విషయం తెలిసిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more