భారత కార్పొరేట్ రంగంలో తీవ్ర సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో రిమాండ్ ఖైదీగా వున్న ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియాపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆమె షీనాని హత్య చేసినట్లుగా నిజం ఒప్పుకోవడంతో ఎందుకు చేసిందోనన్న విషయాల్ని తెలిపింది పోలీసుల విచారణలో భాగంగా వెల్లడించింది. షీనాబోరా హత్య ఉదంతం వెలుగు చూసినప్పటి నుంచి థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్టులు ఈ కేసులో వెలుగుచూశాయి. ఇప్పుడు తాజాగా పోలీసుల విచారణలో భాగంగా ఇంద్రాణీ పన్నిన మరో రహస్య కుట్ర బట్టబయలు కావడంతో ఆమెపై మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
తన కుమారుడు మిఖాయిల్ బోరాను కూడా హత్య చేసేందుకు ఇంద్రాణీ కుట్ర పన్నిందని పోలీసులు తాజాగా ధృవీకరించారు. ఏ విధంగా అయితే ఇంద్రాణీ తన కుమార్తె షీనాబోరాని హతమార్చి సూట్ కేసులో పెట్టి దహనం చేసిందో.. అదే విధంగా కుమారుడు మిఖాయిల్ ను కూడా హత్య చేసి సూట్ కేసులో పెట్టి దహనం చేయాలని ఆమె కుట్రపన్నినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె నివాసాన్ని విచారింగా.. వారికి ఓ బారీ సూట్ కేసు లభించింది. దానిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమెతోపాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లపై మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్టులు వెలుగులోకి రానున్నాయో!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more