డిఎస్.. డి శ్రీనివాస్ అలియాస్ కాంగ్రెస్ మాజీ పిసిసి, కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయ్. కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్ గా ఉన్న డిఎస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా పని చేశారు డి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుండి పిసిసి ప్రెసిడెంట్ వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీలో కొనసాగించారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల మీద ఎప్పటికప్పుడు అన్ని అంశాల మీద వివరణ ఇస్తూ.. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగా ఉన్నారు డిఎస్. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనుకున్న స్థాయిలో రాణించలేదు. తర్వాత జరిగిన పరిణామాలు డిఎస్ ను పార్టీకి దూరం చేశాయి. అయితే తాజాగా డిఎస్ కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది.
డి.శ్రీనివాస్ పార్టీలో మామూలు కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి గుండె కాయగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. అయితే మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి తగిన గుర్తింపు లభించదు. కానీ ఓ మామూలు కార్యకర్తను పిసిసి ప్రెసిడెంట్ ను చేసిన తీరు మాత్రం చాలా మందికి.. అందునా కాంగ్రెస్ పార్టీ వారికి కూడా మింగుడుపడలేదు. అయితే కార్యకర్త నుండి మండలం, తర్వాత జిల్లా తర్వాత రాష్ట్రంలో ఎంతో కీలక పదవులను అందించింది కాంగ్రెస్ పార్టీ.అసలు అంతకు ముందు ఎన్నడూ, ఎవరకి ఇవ్వని ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే స్వయానా రాహుల్ గాంధీ కూడా ఇదే మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిఎస్ లాంటి వ్యక్తులకు ఎంతో చేసినా కానీ పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోతున్నారని బాధపడ్డారు. సరే రాహుల్ బాధ గురించి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే డిఎస్ విషయంలో చేసింది అన్నది నిజం. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ తనకేంచేసిందని మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more