శాంతి భద్రతలను కాపాడవలసిన రక్షకులా లేక మీరు అల్లర్లు, విధ్వంసక చర్యలకు పాల్పడి ప్రజల జీవితాలతో చెలగాటమాడేందుకు వచ్చిన భక్షకులా ? అంటూ గుజరాత్ పోలీసు బలగాలను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా మందలించింది. అహ్మదాబాద్లో పటేల్ వర్గం జరిపిన భారీ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల అనంతరం ఒక కాలనీలోకి ప్రవేశించిన పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రదర్శించిన దౌర్జన్యాలు, అమానవీయ ప్రవర్తకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్లను పరిశీలించిన తరువాత హైకోర్టు ఇలా తన ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి రెండువారాల లోగా నివేదిక అందించాలని పోలీసు కమిషనర్కు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు డైరెక్టర్ జనరల్కు, సిటీ పోలీసు కమిషనర్కు, సంఘటన చోటుచేసుకున్న సోలా పోలీసు స్టేషన్ ఇన్చార్జికి నోటీసులు జారీచేసింది.
నగరంలోని ఒక ప్రైవేటు కాలనీలోనికి సుమారు 40 మంది పోలీసులు ఆగస్టు 25న ఒక్కసారిగా చొరబడి అక్కడి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తూ గాలిలోకి కాల్పులు జరిపారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఒక పక్కన పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల అతి ప్రవర్తనపై ఇద్దరు న్యాయవాదులు విరాట్ పోపట్, తీర్థ దావెలు హైకోర్టులో పిటిషన్ వేశారు. అనుమతి లేకుండా ప్రైవేటు కాలనీలోకి చొరబడడమే కాకుండా విధ్వంసానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన తమ ఆస్తిపాస్తులకు పరిహారం ఇప్పించాలని వారు కోర్టును ఆశ్రయించారు. తమ వాదనకు సాక్ష్యంగా సిసిటివి ఫుటేజీలను వారు కోర్టు ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన జస్టిస్ పార్థివాలా పోలీసుల అతిపై కఠినపదజాలంతో తన ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.
''ఇలా అడ్డూ అదుపూ లేకుండా పోలీసు బలగాలు వ్యవహరిస్తే ప్రజలకు ఎలాంటి సందేశం చేరుతుంది ? ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను పోలీసులే ఇలా ధ్వంసంచేయడాన్ని ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తీవ్రమైనదిగా గుర్తించాలి. తగిన చర్య తీసుకున్నప్పుడే ప్రజలకు పోలీసులపైనా, పాలకులపైనా విశ్వాసం మళ్లీ ఏర్పడుతుంది.'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఏ కారణం లేకుండానే తమ కాలనీలోకి ప్రవేశించిన పోలీసులు నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఇదంతా విధ్వంసక చర్యలను నివారించే ప్రయత్నం అంటూ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు. పౌరుల కనీస హక్కులను కాలరాశారు. పోలీసుల ప్రవర్తన అధికార దుర్వినియోగమే తప్ప మరేమీ కాదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వారు కోరారు. వారి వాదనలను పరిశీలించిన తరువాత కోర్టు ఈ మేరకు ఆదేశాలను ఇచ్చి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more