అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గ్రానైట్ తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ హెచ్1 బోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాయి రైలు బోగిపై పడిపోయి దెబ్బతింది. ఈ సంఘటనలో మరో రెండు బోగీలు పక్కకు పడిపోయాయి. లారీ డ్రైవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్నాయక్లు ఉన్నారు.అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం మంత్రి పరిటాల సునీత, జిల్లా కలెక్టరు, ఎస్పీలతో మాట్లాడారు. సీఎం ఆదేశంలో జిల్లా అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మడకశిర రైల్వేగేటు దగ్గర నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టిన ప్రమాదంలో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. 6గురు మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. రైలు బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ట్రైన్లో ఎస్ 1, ఎస్ 2 బోగిలు బాగా దెబ్బతిన్నాయని. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. నాందేడ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడంతో బెంగళూరు- గుంతకల్లు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. షోలాపూర్ ఎక్స్ప్రెస్ను కల్లూరులో. ముంబయి- బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్ను తాడిచెర్లలో, బీదర్-యశ్వంత్పూర్ రైలును గార్లదిన్నెలో, నిజాముద్దీన్- బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ను అనంతపురంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు వచ్చి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more