ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి నోటిఫికేషన్ విడుదలైంది. 3783 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు సెప్టెంబర్ 20న పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం కేంద్రాల్లో ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఉద్యోగాల విషయమై విస్తృత సమాచారం తెలియజేస్తూ ఇలా అన్నారు...
* సెప్టెంబర్ 20వ తేదీన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించనున్నాం.
* ఈ నెలాఖరులోగా గ్రూప్ 1, 2 పరీక్షలకు సంబంధించిన సిలబస్ను ప్రకటిస్తాం. నిజానికి సిలబస్ వివరాలను ఉద్యోగ ప్రకటనతో మాత్రమే ఇవ్వాలి. కానీ.. కొత్త సిలబస్ కాబట్టి ముందుగా చదువుకునే అవకాశం ఉంటుందని సిలబన్ ను ముందుగానే ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
* అక్టోబర్ చివరిలో గ్రూప్ 2 నోటిఫికేషన్.. డిసెంబర్ లోపు ఉద్యోగాల నియామకం ఉంటుందని స్పష్టం చేశారు.
* గ్రూప్ 1కు ఇంకా కొన్ని సమస్యలున్నాయని.. వాటిలో 53 పోస్టులను తమకిచ్చారని.. వాటిలో కొన్నింటికి సంబంధించి న్యాయపరమైన సమస్యలున్నాయని తెలిపారు.
* కమలనాథన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మరికొన్ని కొత్త ఖాళీలు రావచ్చని, వాటి ఆధారంగా వాటిని బట్టి నవంబర్ నోటిఫికేషన్లో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశముందని చెప్పారు.
* ఈ ఏడాది డిసెంబర్ లోపు 80 శాతం నియామకాలను పూర్తి చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
* మార్చికల్లా గ్రూప్ 2 నియామకాలు మొత్తం పూర్తవుతాయని.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. జరిగిన లోపాల్ని సవరించి డిసెంబర్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
* ఈసారి నియామకాలు పారదర్శకంగా వుంటాయని.. విశ్వాసం వున్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని అనుకున్నట్లుగా పేర్కొన్నారు. ఎవరైనా అడ్డుకుంటే తామేమీ చేయలేమని ముందుగానే హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more