హైదరాబాద్ బస్ భవన్ లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టీసీ యాజమాన్యం ఉన్నపళంగా తొలగించారు. ఇప్పటికి ఏకంగా 67 మందిని తొలగించగా... తెలంగాణలో పనిచేస్తున్న మరో 9వేల మందిని తొలగించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీలో ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు.... అందరినీ పర్మినెంట్ చేయమని ఆదేశిస్తున్నా అన్న సీఎం కేసీఆర్ ప్రకటనకు విలువ లేకుండా పోయింది అక్కడ. ఆర్టీసీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించింది ఆర్టీసీ. జూన్ 14 న ఆర్టీసీ కార్మికులకు 44 శాతం పీఆర్సీ ఇచ్చారు కేసీఆర్. అదే సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు.... ఆర్టీసీలో ఉండకుండా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాని ఇప్పుడు జరిగింది ఇంకొకటి. నెలకు 6వేల రూపాయల వేతనంతో గత ఆరేళ్లుగా పనిచేస్తున్న 67 మందిని ఆర్టీసీ యాజమాన్యం ఉన్నపళంగా తొలగించింది. ఇందులో 52 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 13 మంది అటెండర్స్ ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్య చర్యతో ఆందోళన పథం పట్టారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.
తెలంగాణలో మొత్తం 95 డిపోలు ఉండగా....అక్కడ 9వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిని కూడా త్వరలో తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ఎక్కువయ్యారన్న సాకు చూపి తమను తొలగించారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండపడుతున్నారు. మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డిని కలిసినా తమకు ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వంత రాష్ట్రం వచ్చిందన్న ఆనందం తమకు మిగలకుండా చేశారని అధికారులు, నేతలపై మండిపడ్డారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. తమ రాష్ట్రంలో తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని భావిస్తే ఉన్న ఉద్యోగాలు ఊడాయని అన్నారు. ఇకనైనా రవాణా మంత్రి మహేందర్ రెడ్డి జోక్యం చేసుకోవాలని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more