ఒకప్పుడు మగవాళ్లు అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకునేవారు. మహిళలు చాలావరకు అటువంటి అసభ్య సంస్కృతికి దూరంగా వుండేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. పాశ్చాత్త సంప్రదాయానికి అలవాటుపడ్డ భారతీయులు తమ సంస్కృతిని మరిచి, బంధాలను దూరం చేసుకుంటున్నారు. ఈ విషయంలో నిన్నటివరకు మగవాళ్లు ముందుగా వుండగా.. ఇప్పుడు మహిళల శాతం వారికంటే ఎక్కువగా పెరిగిపోయింది. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో సంఘటనలు చేసుకోగా.. తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని పన్నేండేళ్ల క్రితం ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన మహిళ.. ఇప్పుడు కొడుకును కూడా చంపేసింది.
వివరాల్లోకి వెళ్తే... మహబూబ్నగర్ జిల్లా మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన కిష్టమ్మకు అదే గ్రామానికి చెందిన కిష్టన్నతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు వీరి వివాహజీవితం సక్రమంగానే సాగింది. అయితే.. కొన్నాళ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కిష్టమ్మకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ అక్రమ సంబంధాన్ని వారు ఎవరికీ తెలియకుండా కొన్నాళ్లపాటు కొనసాగించారు. కానీ.. తమ ఈ బంధానికి తన భర్త అడ్డుగా వున్నాడని భావించిన కిష్టమ్మ.. తన ప్రియుడితో కలసి పన్నెండేళ్ల క్రితం భర్తని హత్య చేసింది. ఈ హత్య కేసు వెలుగులోకి రాకుండా వ్యవహరించింది. ఈ విషయమై గ్రామంలో కొన్నాళ్లు ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ.. తర్వాత సమసిపోయాయి. దీంతో ఈ కేసు వ్యవహారం ముగిసిపోయింది. ఇక కిష్టమ్మ తిరిగి వివాహేతర సంబంధాన్ని తన పిల్లలకు తెలియకుండా కొనసాగించింది. అయితే.. ఈ రహస్యం ఎంతో కాలం దాగలేదు.
తన తల్లి వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆమె పెద్ద కుమారుడు పెద్ద మౌలాలి(20) ఇటీవలేకాలంలో తెలిసంది. దీంతో తన ప్రవర్తనను మార్చుకోవాల్సిందిగా మౌలాలి తరచూ తల్లికి హితవు చెప్పేవాడు. ఇది నచ్చని ఆమె తన సోదరులతో కలసి కుమారుడిని హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చి, ఇసుకతో కప్పి పెట్టింది. మౌలాలి కనిపించడం లేదని జూలై మొదటి వారంలో అతని పెదనాన్న కొడుకులు, గ్రామస్తులు మల్దకల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూలై 7న కేసు నమోదైంది. ఎస్పీ, గద్వాల డీఎస్పీ బాలకోటి ఆదేశాల మేరకు మల్దకల్ ఎస్ఐ శ్రీనివాసరావు.. కిష్టమ్మను స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. ఆమె డొంకతిరుగుడు సమాధానాలు చెబుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి, ఆమెని గట్టిగా విచారించారు. దీంతో ఆమె తాను చేసిన తప్పును ఒప్పుకుంది.
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని భర్తను 12 ఏళ్ల క్రితం, ఇప్పుడు కొడుకును హత్య చేసి ఇంట్లోనే పూడ్చినట్లు కిష్టమ్మ పోలీసులకు తెలిపింది. దీంతో శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. ఫిర్యాదుపై ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని గ్రామస్తులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో డీఎస్పీ గ్రామంలో పోలీసు పికెట్ను ఏర్పాటు చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more