ఏపి రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్ కు వ్యతిరేకంగా చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సెలబ్రెటీల ద్వారా ర్యాగింగ్ మీద ప్రచారం కల్పించాలని ఏపి ప్రభుత్వం ఆలొచిస్తున్నట్లు ఏపి మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడించారు. నాగార్జున యూనివర్సిటి క్యాంపస్ లో రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తీవ్ర దుమారం రేపింది. కాలేజిలో ర్యాగింగ్ ను తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని విద్యర్థులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రిషితేశ్వరి తన సూసైడ్ నోట్ లో కాలేజీలొ ర్యాగింగ్ భూతం గురించి వెల్లడించడం సర్వత్రా చర్చకు దారి తీసింది. అయితే రిషితేశ్వరి మృతి మీద వేసిన బాలసుబ్రహ్మణ్యం కమిటి తన నివేదికను మరో పది రోజుల్లో సమర్పించనున్నట్లు గంటా శ్రీనివాస్ వెల్లడించారు.
నాగార్జున యూనివర్సిటీలో కాకుండా అన్ని చోట్ల ర్యాగింగ్ మీద విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలేజీలొ ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని గంటా శ్రీనివాస్ హెచ్చరించారు. ర్యాగింగ్ కు పాల్పడితే జీవిత ఖైదు విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలొచిస్తున్నట్లు గంటా వెల్లడించారు. సిఎం చంద్రబాబు నాయుడు రిషితేశ్వరి ఘటన మీద సీరియస్ గా ఉన్నారని గంటా వెల్లడించారు. త్వరలోనే రిషితేశ్వరి కుటుంబాన్ని ఓదార్చనున్నట్లు టిడిపి వర్గాలు భావిస్తున్నాయి కూడా. అయితే రిషితేశ్వరి వివాదంతో మొదలైన ర్యాగింగ్ వివాదం మీద విద్యార్థి లోకం నినదిస్తోంది. కాలేజీ ఆవరణల్లో ర్యాగింగ్ కు పాల్పడితే విద్యార్థుల మీద చర్యలు తీసుకోవడంతో పాటుగా.. కాలేజీలకు గుర్తింపు కూడా రద్దు చేస్తామని గంటా గట్టిగా హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more