భారత్ లో ప్రతిభావంతులకు కొదవలేదు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంలి నూతన అవిష్కరణ జరిగినా.. అందులో మనవారి పేర్లు వుంటాయి. అంతలా మన దేశస్తులు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు. అలా అని భారత్ లో నీచ కార్యకలాపాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అధికంగానే వుందని స్పష్టం చేస్తుంది ఓ విదేశీ నివేదిక. ఇప్పటికే గత కొద్ది రోజులుగా భారత్ లో చోటుచేసుకుంటున్న అత్యాచారాలతో దేశవ్యాప్తంగా మహిళలు అందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఇప్పుడు తాజాగా కిడ్నాపింగ్ కేసుల్లో మన దేశం.. ప్రపంచంలోనే రెండో స్థానంలో వుందని నివేదిక వివరాలను బట్టభయలు చేసింది.
ప్రపంచంలోనే అపహరణలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని విదేశీ నివేదిక స్పష్టం చేసింది. ఈ .జాబితాలో మొక్సికో తొలి స్థానంలో నిలిచింది. కాగా, అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఉగ్రవాదులకు స్వర్గధామంలా వున్న పాకిస్థాన్, ఇరాక్, నైజీరియా అప్ఠనిస్తాన్ వంటి దేశాలు కూడా భారత్ కంటే వెనకనున్నాయి. లండన్ నుంచి వెలువడే ఓ కంపెనీ ఈ వివరాలు ప్రకటించింది. పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను ప్రకటించారు.
అయితే భారత్ కంటే పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ సురక్షితమైన ప్రదేశాలని కాదు. ఆ దేశాల కంటే భారత్లో కిడ్నాప్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆ దేశాల కంటే భారత్లో జనాభా ఎక్కువ కావడం కూడా దీనికి కారణం కావచ్చు. విచిత్రం ఏమిటంటే కిడ్నాప్ పాలసీలు అమ్ముకోవడానికి భారత్ను మంచి మార్కెట్గా చూడడం మొదలెట్టాయి ప్రపంచ ఇన్సూరెన్స్ సంస్థలు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా నిలిచిన భారత్..లో తప్పడు నివేదికలతో ఇన్సూరెన్స్ సంస్థలకు లాభం చేకూరేలా సదరు నివేదికను తయారు చేశారన్న అరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more