నాగార్జున వర్సిటీలో బ్యాచిలర్ ఆప్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థిని రుషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ చేపట్టిన జిల్లా లీగల్ సెల్ కు హాజరైయిన ప్రిన్సిపాల్ బాబురావు నాగార్జున యూనివర్శటీలో ర్యాగింగే లేదని, ర్యాగింగ్ జరగలేదని చెప్పారు. ర్యాగింగ్ జరుగుతున్నట్లు కానీ, తమ కూతరు రిషితేశ్వరి ర్యాగింగ్ కు గురైనట్లు గాని అమె తల్లిదండ్రులు తనకు ఎలాంటి ఫిర్యాదుుల చేయలేదని చెప్పారు. అదేవిధంగా తాను మద్యం సేవించి పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఎదుట ప్రిన్సిపాల్ బాబూరావు, హాస్టల్ వార్డెన్ స్వరూప రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు న్యాయమూర్తి తెలుసుకున్నారు. తదిపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేశారు. విచారణ అనంతరం ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ మీడియాతో మాట్లాడారు. హాస్టల్లో ర్యాగింగ్ నిరోధానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి తెలిపారు.
విద్యార్థులతో కలసి రేవ్ పార్టీలకు వెళ్లిన తెల్లవారేదాక తందనాలు అడిన ప్రిన్సిపాల్ వీడియో బయటకు రావడంతో అయన అసలు రంగు బయటపడింది. అయినా ఇంకా బుకాయించే ప్రయత్నాలు మానుకోవడం లేదు. ప్రిన్సిపాల్ హోదాలో కొనసాగుతున్న వ్యక్తి విద్యార్థులతో కలసి డాన్సులకు వెళ్లవచ్చా..? అన్న దానిపై ఆయనే సమాధానం చెప్పాలి. యధా రాజా తథా ప్రజ అన్నట్లు.. ప్రిన్సిపాల్ ఎలా వుంటే ఆ కళాశాల విద్యార్థులు కూడా అలానే నడుచుకుంటారన్నది నిజం కాదా..? తమతో డాన్సులు, క్లబులకు తిరిగే ప్రిన్సిపాల్ కు విద్యార్థులు భయపడతారా..? అన్నది సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
కళ్ల ముందు ఇంకా రిషితేశ్వరి బౌతిక కాయం కదలాడుతున్న దృశ్యాలు వీడిపోకముందే.. అదంతా కట్టుకథగా మార్చే ప్రయత్నం సరస్వతమ్మ కొలువైన చోట జరుగుతుంది. అసలు విశ్వవిద్యాలయంలో ర్యాగింగే లేదని చెప్పేవారు.. అందరు శాఖహారులే కానీ మరి రోయ్యల ముళ్లు ఏడపాయే అన్నట్లు.. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందన్న దానికి సమాధానం చెప్పాలి. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు రాసిన మరణవాంగ్మూలం ఆధారంగా ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున దర్నాలు, అందోళనలు చేసి అమెకు న్యాయం జరిగేలా చుస్తున్నాయి.. కానీ అలా వాంగ్మూలం రాయకపోయి వుంటే తమకు ఇష్టమొచ్చిన కథనాలను అల్లి.. అమె మరణంతో తమకు సంబంధమే లేదని కూడా బుకాయించే వాళ్లు. అలాంటి వారిని కాలేజీ ప్రిన్సిపాల్ గా ఎలా నియమించారన్నది కూడా అక్కడి వారికే తెలియాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more