యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న దేశస్థులు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణంతో శోకసంద్రంలో మునిగగా.. ఆయన తర్వాత రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రతిభా పాటిల్ మాత్రం దేశ ప్రజల విసుర్లను, వ్యతిరేకతను చవిచూస్తున్నారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన అమెకు ఇది సమయం సందర్భం కాదని తెలియక చేశారో.. లేక ఎలా జరిగిందో తెలియదు కానీ అగ్ని సాధకుడకి యావత్ దేశప్రజలు నివాళులు అర్పిస్తున్న సమయంలో ఆమె మాత్రం నెట్ జనుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇందుకు తన కారు కారణంగా నిలిచింది. అదెలా అంటారా..?
తనకు అధికారికంగా ఓ కారు కేటాయించాలని, దానికి పెట్రోలు బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని, వీటితో పాటు తన ప్రైవేటు వాహనాన్ని కూడా ఉపయోగించుకోడానిక అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అమె కోరారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాజీ రాష్ట్రపతులకు సొంత వాహనం ఉండే దానికి ఇంధన అలవెన్సు మాత్రమే కేంద్ర భరిస్తుంది. అయితే ఒకవేళ సొంత వాహనం లేని పక్షంలో కేంద్రం వారికి ప్రభుత్వ వాహనాన్ని కేటాయిస్తుంది. ప్రస్తుతం ప్రతిభా పాటిల్ కోరుతన్నట్లు చేయాలంటే నిబంధనలను మార్చాల్సి వుంది. పుణేలో ఉన్నప్పుడు తన సోంత కారు వాడుకుంటానని, వేరే ఊళ్లకు వెళ్లాల్సి వున్నప్పుడు ప్రభుత్వ వాహనం వాడతానని అమె కేంద్రానికి సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
అయితే ఇలా ఇవ్వడం మాత్రం ప్రస్తుతానికి కుదరదని.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు గత మూడు నెలలుగా అమె కార్యాలయంతో అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అయినా ఫలితం లేకుండా సొంత కారు గానీ, అధికారిక వాహనం గానీ ఎదో ఒకటి నిర్ణయించుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమెకు తెలిపింది. తొలుత తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనం సరిపోదని, అంతేకంటే పెద్ద వాహనం పంపాలంటూ దాన్ని తిప్పి పంపివేయడంతో వివాదం ప్రారంభమైంది. ప్రతిభా పాటిల్ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసే విషయాన్ని పక్కనబెడితే.. ప్రతిభా పాటిల్ పై నెట్ జనులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more