రిషితేశ్వరి ఆత్మహత్య మీద దుమారం రేగుతోంది. తోటి విద్యార్థికి జరిగిన అన్యాయం మీద నాగార్జున యూనివర్సిటి అధికారులను నిలదీస్తుంటే... విసి పది రోజుల పాటు యూనివర్సిటికి సెలవులు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అయితే రిషితేశ్వరి వ్యవహారంలో సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైడ్ ఐఎఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటి కొద్దిసేపటి క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చేరుకుంది. రిషితేశ్వరి మరణానికి గల కారణాలు ఏంటి..? ఏ పరిస్థితుల్లో రిషితేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది..? కారణం ఎవరు...? అన్న కోణంలో కమిటి పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది.
Also Read: మరో రిషితేశ్వరి ఆత్మహత్యను ఆపుదాం
ఏపి ప్రభుత్వం ఆదేశాలలానుసారం రిటైడ్ ఐఎఎస్ బాలసుబ్రహ్మణ్యం కమిటి నాగార్జున యూనివర్సిటికి చేరుకుంది. దాదాపు ఐదు రోజులు యూనివర్సిటిలోనే ఉండి పూర్తి స్థాయి నివేదిక తయారుచేస్తామని బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. నెల్లూరు విక్రమసింహ యూనివర్సిటిని విసి వీరయ్య, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటి ప్రొఫెసర్ బాలకృష్ణమ నాయుడు, తిరుపతి పద్మావతి యూనివర్సిటి రిజిస్ట్రార్ పి. విజయలక్ష్మి లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటి సభ్యులు విసితో పాటు విద్యార్థులను కలిసి ఘటన మీద పూర్తి వివరాలను తెలుసుకోనున్నారు.
Also Read: చీకటి చరిత్రకు రిషితేశ్వరి లెటర్ లో ప్రతి అక్షరం సాక్షమే
రిషితేశ్వరి మృతికి కారణమైనట్లు భావిస్తున్న అనీషా, జయ్ కిరణ్, శ్రీనివాస్ లను ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. ప్రిన్సిపాల్ బాబూరావు మీద తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ప్రిన్సిపాల్ ను సస్పెన్షన్ వేటు వేశారు. అయితే బాబూరావు రిషితేశ్వరి మృతికి కారణం అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి గందగోళంగా మారింది. అయితే ఇప్పటికే యూనివర్సిటిలో చాలా చోట్ల సిసి కెమెరాలను అమర్చిన యూనివర్సిటి సిబ్బంది ఎవరినీ యూనివర్సిటి లోపలికి అనుమతించడం లేదు. విద్యార్థులను ఐడి కార్డులను చూసిన తర్వాత కానీ లోపలికి అనుమతించడం లేదు. నాగార్జున యూనివర్సిటీ మీద వస్తున్న కథనాల ఫలితంగా యూనివర్సిటి పరువుపోతోందని భావిస్తోందని.. అందుకే కనీసం మీడియాను కూడా యూనివర్సిటీ లోనికి అనుమతించడం లేదని సమాచారం.
Also Read: రిషితేశ్వరిపై ఈ ముగ్గురి మౌనమేల...?
హన్మకొండకు చెందిన రిషితేశ్వరి అనే విద్యార్థి నాగార్జున యూనివర్సిటి కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మీద, ప్రభుత్వం వైఖరి మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కుల రాజకీయాలకు చంద్రబాబు తలొగ్గుతున్నారని అందుకే రిషితేశ్వరి మృతి మీద ప్రత్యేకంగా విచారణ కోసం బాలసుబ్రహ్మణ్యం కమిటిని నియమించింది. రిషితేశ్వరి మృతి మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి నేడు నాగార్జున యూనివర్సిటి చేరుకున్న కమిటి ఏం రిపోర్ట్ ఇస్తుందో చూడాలి.
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more