ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఎంతో కాలంగా పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజ్కు సంబంధించిన మార్గదర్శకాలు జీఏడీ అధికారులు తయారు చేస్తున్నారని, వారం పది రోజులలో ఈ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం కడియం హామీ ఇచ్చారు.
Also Read: తెలంగాణ నిరుద్యోగ యువతకు తీపికబరు
Also Read: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి అంతా రెడీ: విఠల్
అలాగే జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో రెగ్యులర్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత ఉండడం వల్లే విద్యార్థుల నమోదు సంఖ్య పడిపోతున్నదని కడియం మండిపడ్డారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఉన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు కనీస సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లు విడుదల చేసిందన్నారు. అయితే ఇంటర్మీడియట్ విద్యలో మెరుగైన ఫలితాలు సాధించడానికి తమవంతు కర్తవ్యాన్ని కూడా నిర్వహించాలని, అందుకోసం ఎక్కవ సమయం కాలేజీలలో గడపాలని కడియం శ్రీహరి అధ్యాపకులను ఆదేశించారు. ఈ క్రమంలో సాంఘిక, ఆర్థిక అసమానతలతో పాటు విద్య అసమానతలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మెరిట్కు నాన్ మెరిట్కు మధ్య ఉద్యమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
Also Read: ఈ నెలాఖరుకల్లా ఉద్యోగ ప్రకటన
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more