గోదావరి మహా పుష్కరాల ఘనంగా ముగిసాయి. రాజమండ్రిలోని స్థానిక ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బాబా రాందేవ్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో మంగళంపల్లి బాలమురళికృష్ణ కర్ణాటక గాత్ర సంగీతం అందించగా వెయ్యిమంది కూచిపూడి కళాకారుల నృత్యం చేశారు. ముగింపు వేడుకలను తిలకించేందుకు పలువురు ప్రముఖులతోపాటు ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో కాలేజీ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా మంగళంపల్లి బాలమురళీ కృష్ణను చంద్రబాబు సత్కరించారు. రాజమండ్రిలో వీఐపీ ఘాట్లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పుణ్య స్నానం చేశారు. పుష్కరాల ముగింపు వేడుకల సందర్భంగా ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్, లేజర్ లైట్లు, బాణా సంచా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తెప్పించిన బాణా సంచా కాల్చిన సమయంలో గోదావరి మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోయింది.
అటు తెలంగాణలోనూ గోదావరి మహా పుష్కరాలు ఘనంగా ముగిసాయి. గోదావరి తల్లికి పుష్కరాల ముగింపు సందర్భంగా మంగళ హారతినిచ్చారు. బాసరలోని సరస్వతి మాతా మందిరం నుంచి పుష్కర ఘాట్ వరకు శోభాయాత్రను నిర్వహించారు. ఇటు ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ ఆలయం నుంచి, భద్రాద్రిలో శ్రీ సీతాసమేత రామలక్ష్మణ వారి ఆలయం నుంచి, పోచంపాడ్ లలో ను రాముల వారి ఆలయం నుంచి, కాళేశ్వరస్వామి ఆలయం నుంచి పుష్కరఘాట్ల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ధర్మపురిలో పుష్కర ముగింపు వేడుకలకు మంత్రి ఈటెల, స్వామి స్వరూపానంద తదితరులు పాల్గోన్నారు.
చివరి రోజు సందర్బంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. ఏపీ, తెలంగాణల్లోని గోదావరి పుష్కర ఘాట్లలో భక్తులు కిటకిటలాడారు. రాజమండ్రి, నర్సాపురం, కొవ్వూరు పుష్కరఘాట్లు భక్తులతో కోలాహలంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలోని కేదార్ఘాట్, కోడేరు ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు బారులు తీరారు. కాళేశ్వరంతో పాటు అదిలాబాద్ జిల్లా బాసర ఆలయానికి భక్తజనం బారులు తీరారు. కోటి లింగాల, ధర్మపురి, పోచంపాడ్, సహా అన్ని గోదావరి నదీ పరివాహిక జిల్లాలకు తండోపతండాలుగా భక్తజన సందోహం హాజరై పుణ్యసాన్నాలను ఆచరించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more