మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఇన్నాళ్లు మధుమేహ వ్యాధి భారిన పడిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారంటూ పేర్కోన్న నిబంధనను మధ్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. డయాబెటిక్ రోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులే అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. షుగర్తో బాధపడుతున్నవారు విధులు సక్రమంగా నిర్వహించలేరనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది. యావత్ ప్రపంచానికి భారత దేశం మదుమేహ రాజధానిగా మారిన నేపథ్యంలో ఎంత మందిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిలువరిస్తారని ప్రశ్నించింది.
దక్షిణ రైల్వేలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న పుష్పమ్ అనే మహిళను 8 వారాల్లోగా ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది. మధుమేహ రోగి అని నిర్ధారణ అయిన పుష్పమ్ను గ్రూప్ డి ఉద్యోగంలోకి తీసుకునేందుకు రైల్వే తిరస్కరించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆమె అపాయింట్మెంట్ను వ్యతిరేకిస్తూ రైల్వే సిపిఆర్వో దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు రామసుబ్రహ్మణ్యం, టి.మైత్రివన్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. అదే సమయంలో ధర్మాసనం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ డయాబెటిక్ రీసర్చ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం భారత్లో 40.9 మిలియన్ల మంది మధుమేహవ్యాధి గ్రస్తులని చెబుతూ వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమంటే కుదరదని తేల్చి చెప్పింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more