India makes 276-5 against Zimbabwe in 3rd ODI

India vs zimbabwe 3rd odi live jadhav pandey take ind to 276 5

India vs Zimbabwe, 3rd ODI Live: jadhav, pandey take IND to 276/5, Kedar jadhav century, manish pandey half-century, india, murali vijay, akinya rahane, india tour of zimbabwe 2015, Team india, Stuart Binny, rayudu and binny partnership, india vs zimbabwe, india vs zimbabwe 2015, zimbabwe, zimbabwe vs india, zimbabwe vs india 2015, ind vs zim, ind vs zim 2015, Ambati Rayudu, Elton Chigumbura, Stuart Binny, Zimbabwe, Zimbabwe vs India, Zimbabwe vs India 2015

Kedar jadhav century and manish pandey half-century in a 144-run out standing partnership to send India to 276-5 batting first against Zimbabwe in the third and final one-day international

జింబాబ్వేకు 276 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన టీమిండియా

Posted: 07/14/2015 06:35 PM IST
India vs zimbabwe 3rd odi live jadhav pandey take ind to 276 5

జింబాబ్వేతో జరుగుతున్న మూడవ చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియా.. అతిధ్య జట్టు ముందు 277 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత యాభై ఓవర్లలో టీమిండియా ఐదు విక్కెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది. టీమిండియా జట్టులో స్థానం లభించినా.. గత రెండు మ్యాచ్ లో రాణించలేకపోయిన కేదర్ జాదవ్.. అజేయ సెంచరీతో రాణించగా, మరో ఆటగాడు మనీష్ పాండే కూడా హాఫ్ సెంచరీతో ఔరా అనిపించేట్లుగా తన మెరుగైన ఆటతీరును కనబర్చాడు.

కెప్టెప్ అజింక్యా రహేనే 25 పరుగుల వద్ద 15 పరుగుల వ్యక్తిగత స్కోరుతో వెనుదిరగగా, క్రితం మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించిన మురళీ విజయ్ కూడా 33 పరుగులకే ఔటయ్యి వెనుదిరిగాడు. ఈ క్రమంలో 50 పరుగుల లోపు రెండు విక్కెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను మరింతగా కుంగదీశారు జింబాబ్వే బౌలర్లు. అ తరువాత వచ్చిన మనోజ్ తివారి కేవలం పది పరుగులకే వెనుదిరగడంతో రహానే సేన కష్టాల ఊబిలోకి దిగింది. ఆ తరువాత వచ్చిన రాబిన్ ఉత్తప్ప కాస్త పరువా లేదనిపించినా.. ఆయన కూడా 31 పరుగులు వ్యక్తిగత స్కోరువద్ద పెవిలియన్ దారిపట్టాడు,  దీంతో కేవలం 82 పరుగలకే నాలుగు టాప్ అర్ఢన్ వికెట్లను కోల్పోయిన భారత్ ను మనీష్ పాండే, కేదార్ జాదవ్ లు అదుకున్నారు.

కేదర్ జాదవ్ 87 బంతులలో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో చెలరేగి 105 పరుగులను సాధించి అజేయంగా నిలువగా, మనీష్ పాండే నాలుగు ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 71 పరుగులు సాధించి నాలుగో వికెట్ కు 144 పరుగులు బాగస్వామాన్ని నెలకోల్పారు. కాగా జింబాబ్వే బౌలర్లలో బువిల్లీ మాడ్జీవా రెండు విక్కెట్లు తీయగా, చమ్మూ చిబాబ్బా, మసకడ్జా, యుసేయా చెరో వికెట్ సాధించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  zimbamwe  Kedar jadhav  manish pandey  

Other Articles