జింబాబ్వేతో జరుగుతున్న మూడవ చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియా.. అతిధ్య జట్టు ముందు 277 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత యాభై ఓవర్లలో టీమిండియా ఐదు విక్కెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది. టీమిండియా జట్టులో స్థానం లభించినా.. గత రెండు మ్యాచ్ లో రాణించలేకపోయిన కేదర్ జాదవ్.. అజేయ సెంచరీతో రాణించగా, మరో ఆటగాడు మనీష్ పాండే కూడా హాఫ్ సెంచరీతో ఔరా అనిపించేట్లుగా తన మెరుగైన ఆటతీరును కనబర్చాడు.
కెప్టెప్ అజింక్యా రహేనే 25 పరుగుల వద్ద 15 పరుగుల వ్యక్తిగత స్కోరుతో వెనుదిరగగా, క్రితం మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించిన మురళీ విజయ్ కూడా 33 పరుగులకే ఔటయ్యి వెనుదిరిగాడు. ఈ క్రమంలో 50 పరుగుల లోపు రెండు విక్కెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను మరింతగా కుంగదీశారు జింబాబ్వే బౌలర్లు. అ తరువాత వచ్చిన మనోజ్ తివారి కేవలం పది పరుగులకే వెనుదిరగడంతో రహానే సేన కష్టాల ఊబిలోకి దిగింది. ఆ తరువాత వచ్చిన రాబిన్ ఉత్తప్ప కాస్త పరువా లేదనిపించినా.. ఆయన కూడా 31 పరుగులు వ్యక్తిగత స్కోరువద్ద పెవిలియన్ దారిపట్టాడు, దీంతో కేవలం 82 పరుగలకే నాలుగు టాప్ అర్ఢన్ వికెట్లను కోల్పోయిన భారత్ ను మనీష్ పాండే, కేదార్ జాదవ్ లు అదుకున్నారు.
కేదర్ జాదవ్ 87 బంతులలో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో చెలరేగి 105 పరుగులను సాధించి అజేయంగా నిలువగా, మనీష్ పాండే నాలుగు ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 71 పరుగులు సాధించి నాలుగో వికెట్ కు 144 పరుగులు బాగస్వామాన్ని నెలకోల్పారు. కాగా జింబాబ్వే బౌలర్లలో బువిల్లీ మాడ్జీవా రెండు విక్కెట్లు తీయగా, చమ్మూ చిబాబ్బా, మసకడ్జా, యుసేయా చెరో వికెట్ సాధించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more