మహా విషాదం.. పుణ్యం కోసం అంటూ వచ్చిన భక్తులలో కొంత మంది తొక్కిసలాటలో దాదాపు 27 మంది మృతి చందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మృతుల సంఖ్యఅంతకంతకు పెరుగుతోంది. రాజమండ్రిలో మొదటి రోజు పుష్కారాల సందర్భంగా ఒక్కసారిగా భక్తులు భారీగా తరలిరావడంతో పరిస్థితి గందరగోళం చోటుచేసుకుంది. అయితే మొదటి రోజు పుణ్యస్నానాలు చేస్తేనే పుణ్య వస్తుంది అని చాలా మంది భక్తులు నమ్ముతుండటంతో ఇబ్బందులు తెలెత్తుతున్నాయి. రాజమండ్రిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. రా.మండ్రిలోని కోటగుమ్మ్ం పుష్కరఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల మీద ఏపి చంద్రబాబు నాయడు, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు బాధ్యత వహించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తన్నారు. వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కానీ చివరకు విఫలం కావడం శోచనీయచం అని వారు అంటున్నారు.
రాజమండ్రి పుష్కరాలలో చోటుచేసకున్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పుష్కరస్నానం కోసం వచ్చిన భక్తులు దురదృష్టవశాత్తు మరణించడంపై మోదీ సంతాపం వ్యక్తం చే:శారు. పరిస్థితిని త్వరితగతిన చక్కదిద్దాలని మోదీ చంద్రబాబు నాయుడుకు సూచించారు. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఘటనపై సంతాపం ప్రకటించారు. ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలయజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేసీఆర్ కోరుకున్నారు. ఎలాంటి ఆటంకాలు జరకుండాపుష్కరాలు కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భక్తులు కూడా సయమనంతో పుష్కర స్నానాలు ఆచరించాలని సూచించారు.
* రాజమండ్రిలో30కిమీ ట్రాఫిక్ జామ్
*ఈ ఒక్క రోజే దాదాపు 10 లక్షల మంది వచ్చే అవకాశం
*ఉదయం 3 లక్షల మంది వస్తేనే భారీగా మృత్యువాత పడిన భక్తులు.. ఆందోళనలో భక్తులు.. ఏంజరుగుతుందోనన్న టెన్షన్ లో పోలీసులు, అధికారులు
*ఘటనపై చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి
*చంద్రబాబు నాయుడు కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
*ఒకే సమయంలో రెండు లక్షల మంది స్నానాలు చేస్తున్న భక్తులు
*రాజమండ్రిలో మొత్తం 17 ఘాట్ లు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు స్నానం చేసిన పుష్కర ఘాట్ వద్దకు ఎక్కువ మందికి చేరుకోవడంతో ఇబ్బంది తలెత్తింది. దాంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
*తొలిరోజు పుష్కర స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందనేది కేవలం అపోహ: స్వరూపానందం
*రాజమండ్రి చుట్టు పక్కలి నుండి 108 వాహనాలను తరప్పిస్తున్న అధికారులు
*ప్రస్తుతం పుష్కర ఘాట్ ల వద్ద మూడు అంబులెన్స్ లు అందుబాటులో ఉంచిన అధికార యంత్రాంగం
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more