జనసేనాధిపతి పవన్ కల్యాన్ తాజాగా కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే! 5 కోట్ల ఆంధ్రుల ప్రధాన సమస్య అయిన ‘ప్రత్యేక హోదా’ విషయాన్ని విస్మరించి, లలిత్ మోదీ వ్యవహారాన్ని ప్రధాన అంశంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తోందని ఆయన ఘాటుగా కామెట్లు చేశారు. అయితే.. ఈ ట్వీట్లను కాస్త పరిశీలిస్తే మాత్రం వాటిల్లో ‘చిరు’ అనుమానాలు వెలువడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ అనుమానాలు ఏంటి? అని అనుకుంటున్నారా..? ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే...
పవన్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించడం బాగానే వుంది కానీ.. ఇండైరెక్టుగా ఆయన బీజేపీ తరఫున గళం విప్పుతున్నారా? అనేది మొదటి సందేహంగా వినిపిస్తోంది. మరో సందేహం ఏమిటంటే.. ప్రస్తుతం ఎంపీగా, ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేత అయిన చిరంజీవి ఈ విషయంలో ఇండైరెక్టుగా ప్రశ్నించారా? అని చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆయన డైరెక్టుగా చిరంజీవినే ప్రశ్నించకుండా ఆ పార్టీని ఎందుకు ప్రశ్నించారు? అలా ప్రశ్నించడం వల్ల లాభమేంటి? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ‘ప్రత్యేక హోదా’ని మర్చిపోయిందని కాంగ్రెస్ నేతల్ని నిలదీసిన పవన్.. ఆ పార్టీలోనే వున్న తన అన్నను ప్రశ్నించకపోవడం విడ్డూరంగా వుందని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
ఇకపోతే.. అవినీతిపై ప్రశ్నిస్తానని గళమెత్తిన పవన్.. తన ట్వీట్లలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి లలిత్ మోడీ కేసుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదన్నట్లుగా మాట్లాడారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఆయన ఓటుకునోటు వ్యవహారంపై పెదవి విప్పలేదు కాబట్టి.. పవన్ అవినీతిని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ అనుమానాల విషయం పక్కనపెడితే.. ‘ప్రత్యక హోదా’పై అందరిలోనూ చురుకు పుట్టించడం మంచిదేనని చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more