‘ఇది నా జీవితంలో చాలా బాధకరమైన రోజు’ అని మాజీ పిసిసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన తనకు పార్టీకి రాజీనామా చేయడం చాలా భాధకరమైన రోజుగా చెప్పుకోచ్చారు. ఇది నిజంగా ఊహించని పరిణామంగా ఆయన చెప్పుకోచ్చారు. కాంగ్రెస్ లో తనకు అత్యున్నత పదవులను అంగీకరించానని అంగీకరిస్తూనే ఢీఎస్.. ఆ పదవులలో కోనసాగడం ఒక్కటే కాదు.. తాను పార్టీ కోసం అనేక అవమానాలను కూడా భరించానని చెప్పుకోచ్చారు.
1969లో గాంధీ భవన్ లో అడుగుపెట్టాను.. నా పట్ల సోనియాగాంధీ చూపిన అభిమానానికి ధన్యవాధాలు అని ఆయన చెప్పారు. జీవితాంతం అమెకు రుణపడి వుంటానని చెప్పుకోచ్చారు. సోనియా గాంధీ తనను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదని చెప్పుకోచ్చారు. తాను పార్టీ వదలడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు కాంగ్రెస్ పార్టీ మీద, అధ్యక్షురాలి మీద తనకు ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదన్నారు. తెలంగాణ కోసం కూడా పార్టీలో చర్చించింది, వైఎస్ హయాంలో 2000 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా అంశాన్ని లేవనెత్తింది తానేనని గుర్తు చేసుకోచ్చారు
తాను ఎమ్మెల్సీ పదవి కోసం ఆశించలేదని డీఎస్ చెప్పుకోచ్చారు. రాష్ట్ర పిసీసీస అధ్యక్షుడి హోదాలో ఎంతో మందికి భీ ఫామ్ లు ఇచ్చిన తాను ఎమ్మెల్సీ పదవి కోసం ఆశపడటం లేదని ఆయన అన్నారు, ఎమ్మెల్సీ పదవి తనకు లెక్కే కాదని స్పష్టం చేశారు. తన శిష్యురాలిగానే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పరిచయమైన అకుల లలితకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని డీఎస్ చెప్పుకోచ్చారు. అకుల లలిత అన్ని విధాలా ఎదగాలని ఆశించిన వ్యక్తిని తానని, అమె గెలుపు కూడా తాను శాయశక్తులా కృషి చేశానని తెలిపారు.
దిగ్విజయ్ సింగ్ తన స్థాయిని మరచి మరింతగా దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ప్రకటన చూశాక ఆయనపై వున్న గౌరవం పోయిందన్నారు. చెప్పుడు మాటలు వినే దిగ్విజయ్ అలా మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. ఇన్నాళ్లు తాను కాంగ్రెస్ లో కోనసాగినప్పుడు తన గురించి మాట్లాడే మొనగాడు ఎవరు లేరని, అయితే ఇప్పుడు విమర్శలు గుప్పించడంపై వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పుకోచ్చారు.
తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, అయితే తెచ్చింది మాత్రం కేసీఆర్ అని ఆయన నోక్కి చెప్పారు సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ది కోసం చాలా కమింట్ మెంట్ తో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. బంగారు తెలంగాణ కోసం మాత్రమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పారు. తెలంగాణ అభివృద్ది కోసం తన వంతు సహకారం అందించాలన్న ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పుకోచ్చారు. తాను ఏ పదవినీ ఆశించి పార్టీ మారడం లేదని చెప్పారు పనిలో పనిగా ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం అవసరాల కన్నా ఎక్కువ ఆటంకాలు సృష్టిస్తోందన్నారు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more