తమ ప్రేమను అంగీకరించలేదన్న మనస్తాపంతో చాలామంది ప్రేమజంటలు ఆత్మహత్యలు చేసుకున్న ఘోరాలు ఎన్నో వెలుగుచూశాయి. ఆ తరహాలోనే మరో జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ.. ఈ కహానీలో వీరిద్దరు అనుకున్నది ఒకటి అయితే అయింది మాత్రం మరొకటి! ముందుకు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఆత్మహత్య చేసుకోవాలని వారిద్దరు భావించారు కానీ.. అలా జరగలేదు. మొదట ప్రియురాలి గొంతుకోసిన ఆ ప్రియుడు.. భయంతో తాను ఆత్మహత్య చేసుకోకుండా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోకి లాల్ బాగ్ కు చెందిన ప్రసాద్ సావంత్ (26), లోవర్ పారెల్ కు చెందిన ఏక్తా తల్వాద్కర్ (24) ఇద్దరూ గత 11 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పెద్దలకు తమ ప్రేమ వ్యవహారాన్ని వివరించారు. మతాలు వేరనో లేక మరే కారణమో తెలీదు కానీ.. వారి పెళ్లికి మాత్రం పెద్దలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు.. చనిపోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ చనిపోవాలన్న ఉద్దేశంతో ఆదివారం రాత్రి కళాచౌకీ సమీపంలో కలుసుకున్నారు. ఆ సమయంలో ప్రసాద్ పీకల్లోతు మద్య సేవించాడు. అప్పుడు అతగాడు తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో ప్రియురాలి గొంతును కోశాడు. ఆపై పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అటు తీవ్ర రక్తస్రావంతో పడివున్న ఏక్తాను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రసాద్ పై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తమ కూతురు ఏక్తా చనిపోవడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రసాద్ మంచివాడు కాదని తాను వారిద్దరి పెళ్లికి నిరాకరిస్తూ వచ్చానని.. కానీ తన కూతురు తన మాట నమ్మలేదని తండ్రి అంకుష్ వాపోయారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more