జనసేన పార్టీ అధినేత, తెలుగు సినిమా నటుడు పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై మరో రెండు రోజుల్లో స్పందిస్తానని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలైన ఓటుకు నోటు, ట్యాపింగ్, సెక్షన్ 8లపై మరో రెండు రోజుల్లో మీడియా సమక్షంలో మాట్లాడతానని వివరించారు. ఓటుకు నోటు, ట్యాపింగ్ వ్యవహారంతో పాటుగా సెక్షన్ 8 మీద తన అభిప్రాయాలను మరో రెండు రోజుల్లో తెలియపరుస్తానని అన్నారు. ఒకవేళ అవసరమైతే ఈ వారంలో లేదా వచ్చే వారంలో తాను ప్రెస్ కు ఫోన్ చెయ్యొచ్చు అని కూడా తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న వివాదాల వల్ల భావితరాల మధ్య తిగిరి కోలుకోలేనంత అంతర్యుద్దాలు సంభవిస్తాయని అన్నారు. తల్లిదం్రుడుల తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలతో ప్రభుత్వాలని నడిపితే ఇలానే ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. పాలించే వారి మీదనే అన్నీ ఆధారపడతాయని పెద్ద వాళ్లు చెప్పే వారని, అయితే మరి ఈ నాయకులు మనల్ని ఎలా ముందుకు తీసుకువెళతారో చూడాలని అన్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ రెండు రోజుల్లో తాజాగా పరిణామాలపై చర్చిస్తాను అన్న ట్వీట్ రాజకీయ వర్గాల్లో దుమారాన్ని రేపుతోంది. ఇక రాజకీయ మేధావులు సైతం పవన్ కళ్యాణ్ ఆలచనా ధోరణిని మెచ్చుకుంటున్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్.. తాజాగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందిచనున్నారు. అయితే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెగే దాకా వ్యవహారాన్ని లాగవద్దని హితవు పలికిన పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్లు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. మరి ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు..? ఏం మాట్లాడతారు ?? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more