ప్రపంచదేశాలకు పోటీగా నిలుస్తున్న భారతదేశం.. కొన్ని వ్యవహారాల్లోనూ వెనుకంజలో వున్న విషయం తెలిసిందే! అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. శుభ్రతలో ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ చాలా వెనుకబడి వుంది. అలాగే.. మరో విషయంలోనూ భారత్ చాలా వెనుకబడి వుందని ఒక స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన ‘వరల్డ్ మోస్ట్ పీస్ ఫుల్ దేశాలు-2015’ అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశాల్లో భారత్ 143వ స్థానంలో వుందని సదరు సంస్థ అధ్యయనంలో తేలింది. ఇక పాకిస్థాన్ 154లో స్థానంలో నిలిచింది. నిత్యం నేరాలు, తీవ్రవాద హింసలు, చాలా అధ్వాన్నమైన అంతరంగిక భ్రదతా పరిస్థితులు వంటి కారణాల వల్ల పాకిస్థాన్ ఆ స్థాయిలో వెనుకబడిందని ఆ సర్వే పేర్కొంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో అటువంటి పరిస్థితులే మరింత ఎక్కువగా వుండటంతో ఆ దేశం 160వ స్థానంలో నిలిచింది. ఇక భారత్ లో కూడా అత్యాచార ఘటనలు, అల్లకల్లోలం సృష్టించే విధించే ర్యాలీలు నిర్వహించడం, గృహహింసలు... ఇలా ఎన్నో నేరాలు-ఘోరాలు లో తరుచూ వెలుగులోకి వస్తున్న క్రమంలో అది 143వ స్థానంలో నిలిచినట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది.
అయితే.. ఈ మూడు దేశాల కంటే భూటాన్ (18), నేపాల్(62), బంగ్లాదేశ్(84), శ్రీలంక(114)లు మెరుగైన పరిస్థితిలో వున్నట్లు తేలింది. ఇక అత్యంత ప్రశాంతమైన దేశాల్లో ఉత్తర అట్లాంటిక్ లో వున్న ఓ చిన్న ద్వీపమైన ఐస్ ల్యాండ్ అగ్రస్థానంలో వున్నట్లు ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. దాని తర్వాత డెన్మార్క్, ఆస్ట్రియాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఏదేమైనా.. ప్రశాంతదేశాల్లో భారత్ 143వ స్థానంలో వుండటం చూస్తుంటే దేశంలో ఎన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more